చంద్రయాన్ 3 మరికాసేపట్లో చంద్రుడిపైకి దూసుకెళుతుంది. అయితే ఈ ప్రయోగం విజయవంతమైతే భారత్ అగ్రదేశాల సరసన చేరనుంది. చంద్రుడిపై గతంలో భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలం కావడంతో ఈ ప్రయోగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ చంద్రయాన్ 3 ఒక మహిళ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. ఆమెను రాకెట్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. లక్నోకు చెందిన రీతూ శ్రీవాత్సవ్ చంద్రయాన్ 3 ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.
లక్నోలో చదివి…
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోకు చెందిన రీతూ శ్రీవాత్సవ్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేశారు. తర్వాత సైంటిస్ట్ గా మారారు. ఎన్నో అవార్డులు, రివార్డులను ఆమె అందుకున్నారు. ప్రస్తుతం ఇస్రోలో రీతూ శ్రీవాత్సవ్ సీనియర్ సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు. మార్స్ ఆర్బిటాక్ మిషన్ లోనూ రీతూ కీలక భూమిక పోషించారు. 1996లో లక్నో యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేసిన రీతూ బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటెక్ చేశారు.
చంద్రయాన్ 3 డైరెక్టర్ గా…
రీతూ శ్రీవాత్సవకు అంతరిక్షంలో జరిగే విషయాలపై ఆసక్తి చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉంది. దీంతో ఆమె 1997లో భారత అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్ గా చేరారు. ఇస్రో చేసిన అనేక ప్రయోగాల వెనక రీతూ పాత్ర కూడా ఉంది. అనేక ప్రయోగాలకు రీతూ ఆపరేషన్స్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. అనేక అంతర్జాతీయ జర్నల్స్ కు ఆర్టికల్స్ కూడా రాశారు. రీతూ గతంలో యంగ్ సైంటిస్ట్ అవార్డుతో పాటు ఏఎస్ఐ టీమ్ అవార్డు, సొసైటీ ఆఫ్ ఇండియా ఏరోస్పేస్ టెక్నాలజీ అవార్డులను సొంతం చేసుకున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైతే ఆమె పేరు ఇస్రో చరిత్రలో తిరస్థాయిగా నిలిచిపోతుంది.