భారత్ కు ఎంతో వ్యయప్రయాసల కోర్చి తెచ్చిన చీతాలు ఒక్కొక్కటి మరణిస్తున్నాయి. వివిధ కారణాలతో మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో తాజాగా మరో చీతా మరణించింది. ఆఫ్రికా ఖండం నుంచి ప్రత్యేక విమానంలో తెచ్చి కూనో నేషనల్ పార్కులో ఉంచారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ఆర్భాటంగా ఆరంభించారు. అయితే వాతావరణం పడక కొన్ని మరికొన్ని కారణాలతో ఇంకొన్ని మృతి చెందినట్లు పార్క్ అధికారులు చెబుతున్నారు.
ఏడు చీతాలు…
నాలుగు నెలల కాలంలో ఆఫ్రికా ఖండం నుంచి తెచ్చిన చీతాలు ఏడు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులతో పాటు నేషనల్ పార్క్ సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా తేజస్ అనే చీతా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. రెండు చీతాల మధ్య జరిగిన ఘర్షణ కారణంగా గాయపడిన తేజస్ అనే చీతా మరణించిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు మరణించిన చీతా వయసు నాలుగేళ్లు. భారత్ లో చీతాల సంఖ్యను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వం ఉద్దేశ్యం నెరవేరేలా కన్పించడం లేదు.