(warning)
పెళ్లిలు స్వర్గంలో నిర్ణయమవుతాయి అని పెద్దలు చెబుతుంటారు. పెళ్లి ముహూర్తన్ని బ్రహ్మముడిగా పరిగణిస్తుంటారు. ఏ జంటను కలపాలో, ఏ జంటను విడదీయాలో బ్రహ్మదేవుడు నిర్ణయిస్తాడు..నుదుట రాత రాస్తాడు అంటుంటారు.
ముహూర్తాలకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. వివాహ ముహూర్త సమయం మంచిదైతే భార్యభర్తల జీవితం అన్యోన్యంగా ఎలాంటి కలతలు లేకుండా సాగుతుందని అందరి నమ్మకం. ముహూర్తం చెప్పిన సమయంలో జరగకపోయిన ముహూర్తం దాటాక పెళ్లి జరిగినా ఆపెళ్లి నిలబడదని అంటుంటారు.. భార్యాభర్తల జీవితంలో గొడవలు రావటం, విడాకులు తీసుకుంటే ఆ పెళ్లి ఫెయిల్ అయినట్లే భావిస్తాం. తాజాగా నిహారిక పెళ్లి కూడా విడాకులకు దారితీసిన సంగతి తెలిసిందే.
ముహూర్తం దాటాక నిహారిక పెళ్లి జరిగిందా? (warning)
రాజస్థాన్ లో బంధువుల మధ్య అట్టహాసంగా జరిగిన పెళ్లికోసం 14 కోట్లకు పైగానే ఖర్చు చేశారు. రకరకాల ఈవెంట్లు నిర్వహించారు. డ్యాన్సులు, గ్రాండ్ గా మెహందీ ఫంక్షన్, హల్దీ ఫంక్షన్, సంగీత్ లాంటి ఈవెంట్లతో నానా హంగామా చేశారు. అయితే ఈ ఈవెంట్లలో అందరూ బిజీగా ఉండటంతో నిహారిక పెళ్లి ముహూర్తం దాటిపోయిందని , అనుకున్న ముహుర్తం దాటాకే వారి పెళ్లి జరిగిందని వార్తలొచ్చాయి. అందువల్లే నీహారిక పెళ్లి పెటాకులైందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై చిరంజీవి కోపగించినట్లు తెలుస్తోంది. అందరూ డాన్సుల్లో పడి ముహూర్తం దాటినా చూసుకోకపోవడం వల్లే ఈ అనర్ధం జరిగిందని చిరంజీవి నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాబట్టినిహారిక విషయంలో జరిగిన పొరపాటు వరుణ్ తేజ్ పెళ్లిలో జరగకూడదని చిరంజీవి నాగబాబుకు వార్నింగ్ ఇచ్చినట్లు వినిపిస్తోంది. (warning)
ముహూర్త బలం ముఖ్యం
ముహూర్త బలం మంచిగా ఉంటే ఎన్ని గోడవలు వచ్చిన తట్టుకొని కలిసి ఉంటారని చిరంజీవి భావిస్తున్నారు. అందుకే నాగబాబును పెళ్లికి తొందరేం లేదు లేటు అయిన ఫర్వాలేదు.. ముహూర్త బలం మంచిది చూడు అని సలహా ఇచ్చారని టాక్. చిరు మాటలకు నాగబాబు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఎందుకో తెలియదుగాని మెగా ఫ్యామిలీ కూతుర్ల కాపురాలు ఎప్పుడు చక్కగా లేవు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వైవాహిక జీవితం విఫలం కావడం, ఇప్పుడు నిహారికకూడా అదే బాటలో నడవడం మెగా ఫ్యామిలీని బాధపెట్టిన విషయాలు. అలాంటి తప్పు ఇంకోసారి జరగకూడదనే చిరంజీవి నాగబాబుకు ఈ సలహా ఇచ్చినట్లు టాలీవుడ్ లో గాసిప్ వినిపిస్తోంది.కుమార్తెల జీవితాలు అలా ఉన్నా కొడుకుల కాపురాలు మాత్రం హాయిగా ఉన్నాయి.రాం చరణ్ దంపతులు ఈ మధ్యే ఒక బిడ్డను కూడా కన్నారు.
ఇప్పుడిక వరుణ్ తేజ్ పెళ్లి బాకీ.త్వరలోనే లావణ్య త్రిపాఠి కూడా మెగా కోడలుగా అడుగు పెట్టబోతుంది. వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి బాజాలు మోగనున్నాయి. నవంబర్ 1న వీరిద్దరు పెళ్లి పీటలెక్కుతున్నారు. వారి పెళ్లికి సంబంధించి తరుచుగా ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. రీసెంట్ గా నాగబాబు ఫ్యామిలీ ఆఫ్రికా టూర్ కూడా చేసింది.అయితే వరుణ్ తేజ్ ది డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో వెన్యూ చూసేందుకే వెళ్లారనే టాక్ అక్కడక్కడా వినిపించింది. అయితే వరుణ్ , లావణ్యల పెళ్లి ఇటలీలో జరగబోతోందని తెలుస్తోంది.