కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పొలంలోకి దిగి వరినాట్లు వేశారు. హర్యానాలోని సోనిపట్ కు వెళుతున్న రాహుల్ గాంధీ పొలాల్లో పనిచేస్తున్న రైతులను చూసి ఆగారు. వారితో కాసేపు ముచ్చటించారు. వారితో కలసి వరినాట్లు వేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలోనూ రాహుల్ గాంధీ సామాన్య ప్రయాణికుడి మాదిరిగా ట్రక్కులో ప్రయాణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరినాట్లు వేయడమే కాకుండా ట్రాక్టర్ తో పొలం దున్నారు.
ప్రజలతో మమేకమవుతూ…
రాహుల్ గాంధీ సామాన్య ప్రజలతో మమేకం అవుతున్న తీరు ఆకట్టుకుంటోంది. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీలో పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తుందని నేతలు సయితం అంగీకరిస్తున్నారు. ట్రక్కు లో ప్రయాణించడం, బైక్ మెకానిక్ వద్దకు వెళ్లి పని చేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన పేద ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు నేరుగా వారి వద్ద వెళుతుండటం కూడా ఆకర్షిస్తుంది. రాహుల్ గాంధీని చూసిన రైతులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. ఈ తరహా చర్యలు పార్టీని బలోపేతం చేస్తాయంటున్నారు కాంగ్రెస్ లీడర్లు.
Follow Us On : YouTube , Google News