ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. తన నియోజకవర్గంలో సమస్యలపై ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లోని గురునానక్ యూనివర్సిటీ, శ్రీనిధి యూనివర్సిటీలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ హోదా లేకున్నా విద్యార్థుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేశారని ప్రధాని దృష్టికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసుకెళ్లారు.
తరచూ కలవడంపై…
ఆ కళాశాలలపై ఈడీ, సీబీఐలతో దర్యాప్తు చేయించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానిని కోరారు. ప్రధానిని తరచూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవడం పార్టీలో చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ ప్రధానిని తరచూ కలుస్తుండటాన్ని పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. గతంలోనూ కోమటిరెడ్డి మోదీని కలిశారు. ఇప్పుడు మరోసారి కలవడం పార్టీలో చర్చనీయాంశమైంది.