(AP-TS)
తెలంగాణ ఎన్నికలు ఏపీ రాజకీయాలపై ఓ కొత్త ఎనాలిసిస్ ని ఆవిష్కరిస్తున్నాయి. ఖమ్మం అసెంబ్లీ బరినుంచి ఎన్నికల్లో నిలుస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఓ ఇంట్రెస్టింగ్ చర్చకు తెర లేపారు. ఖమ్మం ఎన్నిక ఫలితం ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుకు దారి తీస్తుందంటూ తుమ్మల ప్రకటించారు. ఖమ్మంలో తన గెలుపు ఏపీలో తెలుగు దేశం గెలుపుకు నాంది పలుకుతుందని అన్నారు. ఖమ్మం అభ్యర్ధిగా కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన నాగేశ్వరావు తెలుగు తమ్ముళ్లతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఖమ్మం సరిహద్దు జిల్లా కావడంతో అటు ఏపీ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన అనేకమంది తెలుగు దేశం నేతలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
తుమ్మల గెలుపు…టీడీపీకి మలుపా?
తెలుగు తమ్ముళ్లను ఉద్దేశించి తుమ్మల మాట్లాడుతూ తనను గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు.. ఖమ్మంలో తాను గెలిస్తే ఏపీలో తెలుగు దేశం అధికారంలోకి వస్తుందంటూ ఓ సరికొత్త సెంటిమెంట్ ను బయటకు తీశారు. తన జీవితమంతా ప్రజాసేవకే అంకితమని, 40 ఏళ్ల రాజకీయ జీవితం తెలుగు దేశం పార్టీతోనే ముడిపడి ఉందని, తెలుగు దేశం సానుభూతి పరులంతా ఈసారి కూడా తనకే ఓటు వేసి, వేయించి తనను గెలిపించాలని కోరారు.
సుదీర్ఘ రాజకీయ జీవితం (AP-TS)
తుమ్మల లాజిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అజేయంగా ఖమ్మం నుంచి గెలుస్తూ వచ్చిన తుమ్మల 2014లో మాత్రం ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపుతో బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీగా ఉంటూ మంత్రి పదవి కూడా పొందారు. 2016లో పాలేరునుంచి ఎమ్మెల్యేగా గెలిచినా 2018లో ఓడిపోయారు. అప్పటినుంచి తుమ్మలను కేసీఆర్ కూడా పక్కన పెట్టారు. తనను పిలిచి పదవి ఇచ్చిన కేసీఆర్ ఆ తర్వాత చూపిన నిరాదరణను తట్టుకోలేకపోయారు. ఇంతలో సమీకరణలు మారి కాంగ్రెస్ కాస్త ప్రచారంలో వేగం పుంజుకోవడం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీడీపీ పాత కాపు కావడంతో ఆపరేషన్ ఆకర్ష్ తో తుమ్మల కాంగ్రెస్ తీర్ధం తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అంటున్నారు కాబట్టి ఖమ్మంలో తుమ్మల గెలిచి తీరాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే తన పాత బలగాన్ని రంగంలోకి దింపారు. వారంత తన గెలుపు కోసం పాటు పడాలని, వారి రుణం తీర్చుకోననీ చెప్పారు. పనిలో పనిగా ఈ లాజిక్ ను తెరపైకి తెచ్చారు. ఖమ్మం పబ్లిక్ పల్స్ కు వేదిక అనీ, ఖమ్మంలో తన గెలుపు ఏపీలో టీడీపీ గెలుపుకు బాటలు వేస్తుందని అన్నారు.
తనను గెలిపిస్తే ఆ రుణం ఊరికే ఉంచుకోనని అందరూ బాగుండాలన్నదే తన కోరిక అనీ అన్నారు. అలా తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహాన్ని నింపారు. అసలే చంద్రబాబు జైలు ఎపిసోడ్ తో పాతాళానికి ప డిపోయిన పార్టీ గ్రాఫ్ ను కనీసం ఇలాంటి మాటలతోనైనా పైకి లేపాలని చూస్తున్న తెలుగు తమ్ముళ్లు తుమ్మల కబుర్లకు తెగ పొంగిపోయారు. నిజంగానే తుమ్మల గెలిస్తే ఏపీలో మళ్లీ టీడీపీ గెలిచి తమ వైభవం వస్తుందని వారు ఆశపడుతున్నారు. ఇంతకీ తుమ్మల లాజిక్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందంటున్న కొన్ని సర్వేల ప్రకారం ఖమ్మంలో తాను కూడా గెలవాలి. అదే గెలిస్తే ఏపీ రాజకీయాలను తాము ప్రభావితం చేయగలమనా? ఎటూ టీడీపీ నిస్సిగ్గుగా కాంగ్రెస్ తో గత ఎన్నికల్లోనే చేయి కలిపేసింది. ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ సాక్షాత్తూ మాజీ టీడీపీ నేత. దాంతో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే అక్కడ టీడీపీని గెలిపిస్తామని ముందే భరోసా ఇస్తున్నారా తుమ్మల? (AP-TS).
రివర్స్ అప్లయ్ చేస్తే?
మాజీ మంత్రి గారి లాజిక్కులు వినడానికి బాగానే ఉన్నా,మరి ఆయన ఓడిపోతే.. ఏపీలో జగన్ గెలుస్తాడనేగా అర్ధం? ఇది వింటున్న వైసీపీ శ్రేణులు ఊరుకుంటాయా? అసలే వైనాట్ 175 అంటూ ఫ్యాను గాలి స్పీడుగా తిరిగేస్తోంది. వెంటనే సోషల్ మీడియాలో తుమ్మలక రివర్స్ కౌంటర్లు పడుతున్నాయి. ఓ వైపు చంద్రబాబు కూడా రేవంత్ తో సీక్రెట్ చర్చలు జరిపినట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ కొంగు చాటు ప్రేమలు ఎప్పుడు బహిర్గతమవుతాయో మరి. (AP-TS)