Deep Fake
సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు కలవర పెడుతున్నాయ్. ఆర్టి ఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించే ఈ వీడియోలు సెలబ్రిటీలు, సామాన్యుల వ్యక్తిగత ప్రైవసీకి , గౌరవానికి భంగం కలిగిస్తున్నాయ్. నిన్న శాండల్ వుడ్ బ్యూటీ రష్మికా మందన్న పై సోషల్ మీడియాలో వచ్చిన అత్యంత దారుణమైన డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దుమారం సద్దు మణగకముందే బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ పై మరో డీప్ ఫేక్ వీడియో రిలీజ్ అయ్యింది. టైగర్ త్రీ అనే రాబోయే మూవీనుంచి తీసిన ఫుటేజ్ ను మార్పింగ్ చేసి ఈ ఫోటోలు తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఒరిజినల్ ఫోటోలో బాలీవుడ్ స్టార్ టవల్ చుట్టుకుని ఉన్న ఓ హాలీవుడ్ స్టంట్ విమెన్ తో పోరాటం చేస్తున్నఇమేజ్ ఉంది.. అయితే ఇందులో కత్రీనా కైఫ్ టవల్ కు బదులుగా లో- కట్ వైట్ టాప్ అదే మ్యాచింగ్ బాటమ్ వేసుకున్నట్లుగా మార్ఫింగ్ చేశారు. ఈ ఇమేజ్ ను ఆర్టి ఫీషియల్ ఇంటలిజెన్స్ టూల్స్ ఉపయోగించి మార్ఫింగ్ చేశారు. వ్యక్థుల ముఖాలను వీడియోల్లోనూ, ఫోటోలలోనూ సైతం ఇలా మార్చేసే టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్లనే మార్ఫింగ్ కంటెంట్ సునాయాసంగా బయటకు వచ్చేస్తోంది.
నెటిజన్ల ఆగ్రహం
టైగర్ త్రీలో కత్రీనా కైఫ్ టవల్ సీన్ ను మార్పింగ్ చేయడం దారుణాతిదారుణం. ఏఐ టెక్నాలజీ గొప్పదే కావచ్చు.. కానీ మహిళల ఆత్మగౌరవానికి, ప్రైవసీకి భంగం కలిగించడం అన్యాయం. అహేతుకం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
రష్మిక పైనా అదే దారుణం Deep Fake
రెండురోజుల క్రితం స్టార్ హీరోయిన్ రష్మిక మార్పింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై కేంద్ర ఐటీ శాఖ, బిగ్ బీ అమితాబ్, టాలీవుడ్ నుంచి నాగచైతన్య వరకూ అందరూ స్పందించి రష్మికకు అండగా నిలబడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. తన పై మార్ఫింగ్ అస్త్రం ప్రయోగించడం పట్ల రష్మిక కూడా తీవ్ర ఆందోళనను, విచారాన్ని వ్యక్తం చేసింది. కుటుంబ సభ్యులు, చిత్రపరిశ్రమ, అధికారులు అండగా నిలవడంతో ఊపిరి పీల్చుకున్నట్లు తెలిపింది. ఇంతకీ రష్మిక స్థానంలో ఒరిజినల్ క్లిప్ లో ఉన్న సోషల్ మీడియా ఇన్ ఫ్లుయోన్సర్ జరా పటేల్ కూడా రియాక్ట్ అయ్యారు.
ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెడుతూ డీప్ ఫేక్ టెక్నాలజీతో నా ముఖానికి బదులు మరొకరి ముఖాన్ని జోడించిన వీడియో విషయం లో నా ప్రమేయం ఎంత మాత్రమూ లేదు. జరిగిన దానికి నేను చింతిస్తున్నా.. ఏఐ తో మహిళలు, చిన్న పిల్లల భద్రత సందేహంలో పడిపోతోంది. సోషల్ మీడియాలో ఏం పంచుకోవాలన్నా భయం వేస్తోంది. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అంటూ జరాపటేల్ రియాక్ట్ అయ్యింది. బ్రిటీష్ ఇండియన్ అయిన జరా పటేల్ ఇన్ స్టా గ్రామ్ లో బాగా పాపులర్ మహిళ. ఆమె ఖాతాను ఏకంగా 4లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఆమె డేటా ఇంజనీర్,ప్లస్ మెంటల్ హెల్త్ అడ్వొకేట్ గా పని చేస్తోంది.
ఇదిలా ఉంటే రష్మిక మందన్నకు చిత్ర పరిశ్రమ నుంచి సపోర్ట్ పెరుగుతోంది. తాజాగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ స్పందించింది. మహిళల శరీర భాగాలను జూమ్ చేసి మరీ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మన సమాజం ఎటు పోతోంది? మేం ప్రొఫషన్ పరంగా నటులమే అయినా మాకు వ్యక్తిగత ప్రైవసీ, భద్రత, అవసరంలేదా?రష్మిక ధైర్యంగా స్పందించడం మంచి పరిణామం.. అందరూ దీనిని ఖండించాలని కామెంట్ చేసింది.