Delhi
ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమైపోయింది. ఎంతలా అంటే అక్కడ స్కూళ్లు, కళాశాలలు మూత పడేంతలా..స్వచ్ఛమైన గాలి జాడ లేక ఢిల్లీ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఢిల్లీలోని లోఢీ రోడ్, జహంగీర్ పురి, ఆర్ కె పురం, ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో అయితే అసలు ఊపిరి ఆడటం లేదు జనాలకి.అక్కడ గాలి నాణ్యత అత్యంత ఘోరంగా వరుసగా 438,491,486,473 కింద నమోదయ్యింది. దీనిని ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటారు . కేంద్ర కాలుష్య నివారణ బోర్డు ఈ రీడింగ్స్ ను నమోదు చేసింది. గాలి నాణ్యత మెరుగు పరచడానికి లోఢీ రోడ్ లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్లపై నీటిని జల్లుతోంది.
ప్రమాదకరంగా నోయిడా పరిసరాలు
ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలోని సెక్టర్ వన్ లోని 62,సెక్టర్ 116లలో గాలినాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలిలో క్షీణిస్తున్న నాణ్యత వల్ల నిర్మాణ రంగంలో పనులన్నింటినీ నిలిపివేశారు. ప్రాథమిక పాఠశాలలు మూసివేశారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈ చర్యలు తీసుకోక తప్పడం లేదు.
దీపావళి రాకముందే (Delhi)
సాధారణంగా దీపావళి తర్వాత ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతుంటుంది. అందుకే దీపావళికి ఎవరూ క్రాకర్స్ కాల్చవద్దంటూ ఢిల్లీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంటుంది. కానీ ఈ ఏడాది పండగ కన్నా ముందే వాయుకాలుష్యం పీక్స్ కు చేరిపోయింది. వాతావరణం మారి చలిగాలులు పెరిగి గాలి సాంద్రత దట్టంగా మారడం దీనికి కాలుష్యం తోడయి గాలి నాణ్యత పడిపోవడం జరిగాయి. శ్వాస కోశ సమస్యలతో రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి విపరీతమైన దగ్గు, చలి, కళ్ల మంటలు, శ్వాస సమస్యలు,ఛాతీ పట్టేసినట్లుండటం లాంటి సమస్యలతో సతమతమవుతున్నారు.అన్ని వయసుల వారికీ ఇదే రకమైన ఇబ్బంది. అందుకే ప్రజలు బయటకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించమని డాక్టర్లు సలహా ఇస్తున్నారు.
భవన నిర్మాణ పనుల నిలిపివేత (Delhi)
గాలి నాణ్యత 400 దాటిన ప్రదేశాల్లో వారం పాటూ భవన నిర్మాణ పనులు ఏవీ చేపట్టవద్దని, పాఠశాలలు మూసివేశాయని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఆదేశాలు జారీ చేశారు. వాహన కాలుష్యం తగ్గించడానికి కార్లపై రెడ్ లైట్ ను ఆఫ చేయమని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ప్రజా రవాణా కోసం వెయ్యి ప్రైవేట్ సీఎన్జీ బస్సులను అద్దెకు తీసుకుని నడపాలని నిర్ణయించింది. పంటల కాల్చివేత, పర్యావరణ వ్యతిరేక వాతావరణం కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం రానున్న రెండు వారాల్లో మరింత పెరుగుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. వాయు కాలుష్యం వల్ల చిన్న పిల్లలు, వృద్ధుల్లో ఆస్త్మా, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పొగమంచుతో యాక్సిడెంట్లు
ప్రస్తుతం ఢిల్లీ పరిసరాల్లో ఎటు చూసినా దట్టమైన పొగమంచు కనిపిస్తోంది. గాలి సాంద్రత దీనివల్ల దట్టంగా మారుతోంది. దాంతో గాలి పీల్చుకోవడం కష్టమవుతోంది. ఉదయం 11 దాటితే కానీ సూర్యకిరణాలు కనిపించడం లేదు. ఎక్కువ సమయం మబ్బుగా ఉండటంతో ప్రజల్లో బద్ధకం కనిపిస్తోంది. జనం స్వెటర్లు వేసుకుని గడిపేస్తున్నారు. పొగమంచు వల్ల రహదారి కనపడక వాహనాల యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. హర్యానాలో ప్రతీ ఏటా పంట వ్యర్ధాలను కాల్చివేయడం ఆనవాయితీ. దానివల్ల గాలిలోపొగ, ధుమ్ము, ధూళి పేరుకు పోతున్నాయి. ఆ గాలులో ఇటు ఢిల్లీ (Delhi) వరకూ వ్యాపించి వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. వివాదాస్పదమైన ఈ అంశం ప్రతీ ఏడాది గొడవకు కారణమవుతోంది.