Delhi supreme court
ఢిల్లీలో పతాక స్థాయికి చేరిన వాయుకాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. రాష్ట్రాల నిర్లక్ష్యం వల్ల బాధ్యతా రాహిత్యం వల్ల వాయు కాలుష్యానికి పాల్పడితే అది ప్రజారోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఇంత మంది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే హక్కు మీకు లేదు అంటూ నాలుగు రాష్ట్రాలను తీవ్రంగా మందలించింది. ప్రతీ ఏడాది శీతాకాలంలో పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో రైతులు పంట వ్యర్ధాలను తగుల బెడుతుంటారు. ఈకారణంగా దట్టమైన పొగ, బూడిద, దుమ్ము, ధూళి ఎగురుతూ ఉంటాయి. అవి కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించి గాలి ద్వారా ఢిల్లీ పరిసరాలను చేరుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణంగా ఉంది. ఈ పంట వ్యర్ధాల దహనం విషయంలో ఆ నాలుగు రాష్ట్రాలే ఏదో ఒక నిర్ణయం, పరిష్కార మార్గం చూడాలని లేకపోతే ప్రజారోగ్యం దెబ్బతింటోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదో ఒకటి చేయండి. ఇది మాత్రం ఆపండి.. అది మీ డ్యూటీ. అతి త్వరగా దీనికో పరిష్కారం సాధించండి . ఇది రాజకీయ యుద్ధం కాదు .. ఉపేక్షించడానికి అని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్ట్.
ఆప్ ప్రభుత్వానికి మందలింపు Delhi supreme court
ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా సుప్రీం కోర్టు మందలించింది. నగరంలో చాలా బస్సులు వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని, మరికొన్ని బస్సులు సగం జనాభా సామర్ధ్యంతోనే నడుస్తున్నాయని, ఈ సమస్యను పరిష్కరించుకోమని సూచించింది. జస్టిస్ ఎస్.కె. పాల్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పంట వ్యర్ధాల కాల్చివేతను నివారించడానికి కేంద్రం ఆ నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా చర్చలు జరపాలని కేంద్రాన్ని కోరింది. వాహనాల కాలుష్యాన్ని కూడా తీవ్రంగా పరిగణించాలంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోవడంపై దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారించింది. కేంద్ర వాయుకాలుష్య నియంత్రణ బోర్డు డాటా ప్రకారం ఢిల్లీలో అనేక ప్రాంతల్లో వాయునాణ్యత 400కి పైమాటే. అది గాలి నాణ్యత ప్రమాణాల కన్నా నాలుగు రెట్లు ఎక్కువ.
పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ పంజాబ్ లో పంట వ్యర్ధాలను కనీసం చెక్ చేయడం లేదన్నారు. వాటి వల్లనే ఢిల్లీలో కాలుష్యం పెరుగుతోందన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా పంట వ్యర్ధాల దహనం యధేచ్ఛగా సాగుతోందని ఆమె ఆరోపించారు. 2017 నుంచి ఈ సమస్య నానుతోందని, ఎన్నో ఆదేశాలు బుట్ట దాఖలు అయ్యాయని మరో అడ్వకేట్ జనరల్ ఆరోపించారు. పంజాబ్ లో వరి పంటకు బదులు ప్రత్యామ్నాయంగా మరో పంట ఏదైనా వేసేలా కేంద్రం, రాష్ట్రం చర్చలు జరపాలని, వరి పంట వల్ల రాష్ట్ర భూగర్భ జలాలు కూడా ధ్వంసం అవుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
రాజకీయ అస్త్రంగా మారిన అంశం
గత కొన్నేళ్లుగా పంట వ్యర్ధాల దహనం అనది రాజకీయ అంశంగా మారిపోయింది. ఆప్ ప్రభుత్వం గతంలో పంజాబ్, హర్యానా ప్రభుత్వాలను ఇదే అంశంపై తూర్పారబట్టింది. అయితే ప్రస్తుతం అటు పంజాబ్లోనూ, ఇటు ఢిల్లీలోనూ ఆప్ ప్రభుత్వమే అధికారంలో ఉంది. దాంతో బీజేపి అధికారంలో ఉన్న హర్యానా యే ఇందుకు మూలకారణమంటూ మాట మార్చేసింది ఆప్. పంజాబ్ లో ఈ సమస్యను సగం వరకూ నియంత్రించామంటూ చెప్పుకొస్తోంది. యూపీ, హర్యానాల్లో డీజిల్ బస్సులను నిషేధించడం మాని అనవసరంగా నిందలు మాపై వేస్తున్నారంటూ ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ విమర్శించారు.
పంట వ్యర్ధాలను తొలగించడమే సమస్య Delhi supreme cour
పంజాబ్, హర్యానాల్లో కొత్త పంట వేసే ముందు పంటలను దహనం చేయడం రివాజు.. అప్పుడే వారు దుక్కి దున్ని నారును సిద్ధం చేసుకునే టైమ్. అందువల్ల వేగంగా, చవకగా పంట వ్యర్దాలను తొలగించడమంటే వాటిని కాల్చివేయడమే పరిష్కారం. లేదా కూలీలను , మిషన్లను పెట్టి పంట వ్యర్ధాలను తొలగించడం ఒక పద్ధతి. అయితే దీనికి చాలా డబ్బు ఖర్చవుతుంది. నిరుపేద రైతులు అందుకే పంటలను కాల్చేందుకే సిద్ధపడతారు.