”వంద కోట్ల రూపాయల పోస్టర్లు, వంద రోజుల ఫంక్షన్లు చూశాను. అయితే తొలిసారిగా వంద అవార్డుల ఫంక్షన్ను ‘బలగం’తో చూస్తున్నాం’ అన్నారు ‘దిల్’ రాజు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై వేణు ఎల్దండి దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, హన్సిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న విడుదలైంది.
‘బలగం’ ప్రపంచవ్యాప్తంగా 100 అంతర్జాతీయ అవార్డులు అందుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా జరిగిన విశ్వవిజయ శతకం కార్యక్రమంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ”మా పిల్లలు హన్సిత, హర్షిత్లు కలిసి నిర్మించిన తొలి సినిమాకే 100 అంతర్జాతీయ అవార్డులు రావడం గొప్ప విషయం. రాజమౌళి భారీ బడ్జెట్తో రూపొందించిన ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాయి. కానీ ‘బలగం’ ఓ చిన్న పట్టణంలో నేటివిటీతో తీశారు.
100 అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. ఇటీవల వచ్చిన ‘సామజవరగమన ’, ‘బేబీ’ వంటి హిట్ చిత్రాలతో చిన్న, కుటుంబ కథా చిత్రాలు ఆడాలనే నమ్మకం ఏర్పడింది. కొత్త ఊపిరి వచ్చినట్లుంది’’ అన్నాడు. బలగం తెలంగాణ సినిమాగా ప్రచారంలోకి వచ్చింది. కానీ అది తెలుగు సినిమా’’ అన్నారు వేణు. నేనూ, అన్న నిర్మించిన తొలి సినిమాకే వంద అంతర్జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు హన్షిత.