X
కరోనా పోయి చాలా కాలమే అవుతున్నా ఇంకా దాని మూలాలు భయపెడుతూనే ఉన్నాయి. తొందరలోనే కరోనా లాంటి వైరస్ మరోసారి ప్రపంచం మీద దాడి చెయ్యబోతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఆ వైరస్ ని డీసీజ్ఎ క్స్ అని పిలుస్తున్నారు. ఈ కొత్త రకం వైరస్ లక్షణాలు ఇంకా తెలియనప్పటికి దీని ప్రభావం మాత్రం చాలా దారుణం గా ఉందబోతోందట. గతం లో కోట్ల మందిని హరించిన స్పానిష్ ఫ్లూ కన్నా ఇంకా భయంకరమైన మరణాలు మనం చూడబోతున్నాం అంటున్నారు బ్రిటన్ కి చెందిన ఓ శాస్త్రవేత.
డీసీజ్ యెక్స్ X అంటే
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం డెసీజ్ యెక్స్ అంటే ట్రీట్మెంట్ కు లొంగని కొత్త వైరస్,లేదా బాక్టీరియా, లేదా ఫన్ గస్ .. మానవాళి పైన చేసే భయానక దాడి. అంతు చిక్కని కంటికి కనిపించని క్రిమి మనవాళిని కబళించ వచ్చు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చ రిస్తోంది . 2018 లోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి సంబంధించిన సంకేతాలు ఇచ్చింది. కరోనా పాండమిక్ 50 మిలియన్ ల జనాభాని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు అదే తరహా లో ఈ కొత్త వైరస్ దాడి చేయవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. మానవాళి మీద దాడి చేసే ఆస్కారమున్న 25 వైరస్ లని ఇప్పటి వరకూ సాస్త్రవేత్తలు గుర్తించారు.. ప్రపంచం లో ఇంకా గుర్తించని పది లక్షల వైరస్ లు ఉన్నాయని అవి ఒక జీవి నించి మరో జీవికి వ్యాపించవచ్చని అంటున్నారు.
ఇక మానవాళి అంతమేనా ?
కోవిడ్ 19 సోకిన వారు కోలుకున్నారు. కానీ డీసీజ్ యెక్స్ వస్తే తట్టుకోవడం కష్టం. ఎబోలా వైరస్ లా ప్రాణాంతకం గా మారుతుంది. ప్రపంచం లో యెక్కడో యే మూలో దీని దాడి మొదలు పెడితే ఇక తట్టుకోవడం కష్టం. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న గ్లోబలీకరణ,పట్టణాలకి పెరుగుతున్న వలసలు మనుషులమధ్య బంధాలని పెంచుతున్నాయి. దాంతో అంటు వ్యాధులు ప్రబలుతున్నాయి. డీసీజ్ యెక్స్ వస్తే మాత్రం కరోనా ని మించి ప్రభావం ఉంటుందని ప్రపంచం లో మెజారిటీ జనభా తుడిచి పెట్టుకు పోతుందని అంటు వ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు… కరోనా కే ఇంకా సరైన మందు లేదు. ఇక కొత్తగా పుట్టుకొచ్చే వైరస్ లని అదుపు చేసేశక్తి మానవాళికి అసలు ఉండకపోవచ్చు.. కరోనాకీ ఇప్పుడు ఇచ్చే టీకా కూడా సరైనది కాదని, ఇక అలాంటప్పుడు కొత్త వైరస్ కి కనుగొనడం అసాధ్యమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆధునికత తెస్తున్న సమస్యలు కొన్నైతే మన నిర్లక్ష్యం తో తెచ్చుకునే ముప్పులు మరికొన్ని. అందుకే శుభ్రత విషయం లో అందరూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.ఇల్లు, పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవడమే కాదు వ్యక్తులు కూడా శుభ్రం గా ఉండాలి. వైద్యులు ఆరోగ్య నిపుణుల సూచనలనే హెచ్చరికలుగా భావించి మానవాళి జాగ్రత్త పడాలి. కరోనా నేర్పిన పాఠాలని పాటిస్తూ రాబోయే ముప్పు ను తప్పించుకోవాలి. కానీ శాస్త్రవేత్తల హెచ్చరికలు చూస్తుంటే ఇది అంతా సులభంగా తప్పించుకునే ముప్పు కాదని వైరస్ రూపాంతరం చెందితే వచ్చే వికృత స్పందనలు దారునం గా ఉండబోతున్నాయని తెలుస్తోంది.