పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగినప్పుడు అందులో నుంచి ఎన్నో అద్భుతాలు ఉద్భవించాయి. అలాగే హాలాహలం అనే విషం కూడా ఉద్భవించింది. అప్పుడు ఈ విషాన్ని ఎవరు తీసుకోవాలో తెలియక దేవతలంతా సందిగ్ధం లో పడ్డారట. అప్పుడు శివుడు (Lord Siva) లోకాలను కాపాడేందుకు ఆ విషాన్ని మింగి గరళకంఠునిగా మారాడు. శివుడు ఆ విషాన్ని త్రాగే సమయంలో కొద్దిపాటి విషం కిందకి ఒలికిందట. అప్పుడు శివుని చెంతనే ఉన్న నందీశ్వరుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషాన్నీ ఆరగించేశాడట. మహా మహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని మీద ఉన్న భక్తి తో నమ్మకంతో ఆ హాలాహలాన్ని చప్పరించేసి తణుకు బెణుకు లేకుండా నిల్చున్నాడట.
శివుడికి సేవకుడు నంది
నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఆయనను శివునికి సేవకునిగానే కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు. తమిళనాట ఆయనను అష్టసిద్ధులు కలిగినవానిగా జ్ఞానిగా, ప్రథమగురువులో ఒకనిగా భావిస్తారు. అంతేకాకుండా నందీశ్వరునికి ప్రత్యేకమైన ఆలయాలు కూడా ఉన్నాయి. శైవమత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన్నగుడి, మైసూర్ వంటి ప్రదేశాలలో నందీశ్వరినికి ఆలయాలు ఉన్నాయి. ఇక తెలుగునాట కూడా లేపాక్షి (అనంతపురం) మహానంది (కర్నూలు) వంటి క్షేత్రాల్లో నందీశ్వరుని ప్రాధాన్యత కనిపిస్తుంది.
ఈ సృష్టిలో శివుడు ఉన్నంతకాలమూ ఆయన భక్తుడైన బసవన్నకి కూడా ఏ లోటూ ఉండదాని ప్రతీతి.మరి నంది చెవిలో చెప్పే కోరికలు నెరవేరుతాయా నందీశ్వరుడి మాట శివుడు (Lord Siva) వింటాడా..సాధారణంగా దేవాలయంలోనికి భక్తులకు ఈశ్వరుని వాహనమైన నంది చెవిలో కోరికలు చెప్పడం ద్వారా మన కోరికలు నెరవేరుతాయని, పెద్ద కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
అయితే ఈ ఆచారం వెనుక గల కారణాలేంటంటని ఆరాతీస్తే.. శివుడు ఎప్పుడు తపస్సులోనే వుంటాడు. ఆయన తపస్సుకు ఎప్పుడూ ఎవ్వరు ఎలాంటి భంగం కలిగించకూడదుఅందుకే నంది ద్వారా మన కోరికలని, భాధలను ఆ పరమ శివునికి తెలియజేస్తాము. నంది శివునికి ఎదురుగా వుంటాడు కాబట్టి..ఆయన వద్ద మన కోరికలు తెలియజేస్తే..ఆయన బడగవంతుని దృష్టికి తీసుకెళ్తాడని పండితులు అంటున్నారు. ఏ భక్తులు తమ సమస్యలతో శివుని వద్దకు వచ్చినా, నంది అక్కడ వారి కోరికలను విని శివునికి తెలియజేస్తాడనేది నిజం. ఈ విధానాన్ని భక్తులు నంది చెవిలో చెప్పే ప్రతి విషయం తప్పక జరుగుతుందని విశ్వసిస్తుంటారు.
నందీశ్వరుడు గొప్ప ధూత..
భక్తుల అభిప్రాయం ప్రకారం, నంది మాత్రమే ఎవరిపైనా వివక్ష చూపడని నమ్ముతారట. 64 కళలలో దిట్ట అయినప్పటికీ వినయంగా వుండే నందీశ్వరుడు తన స్పష్టమైన పదాలతో శివునికి భక్తుల యొక్క సందేశాన్ని,కోరికలని అందిస్తాడట. అందుకే అతన్ని శివుని దూత అని కూడా పిలుస్తారట . నంది శివునికి ప్రధాన గణం, అందుకే శివుడు కూడా అతని మాట వింటాడు.
నందీశ్వరుని విశిష్టత
ఒకసారి కైలాసం లో శివపార్వతులు ఇద్దరు ధ్యానం లో మునిగిపోయి ఉన్నారు వారితో పాటు నంది కూడా ధ్యానం చేయాలని నిర్ణయించుకున్నాడట. ఆ సమయంలో అతను శివుని ముందు కూర్చుని తపస్సు చేసాడట , అందుకే నంది విగ్రహం ఎల్లప్పుడూ శివుని ముందు ఉంటుంది అని చెప్తున్నారు పండితులు. ఒకప్పుడు జలంధరుడనే రాక్షసుడి నుండి తమను తాము రక్షించుకునేందుకు భక్తులందరూ శివుని వద్దకు వెళ్లారట. శివుడు తపస్సులో మునిగిపోయి ఉన్న కారణం చేత వారికి శివునికి ఏమి చెప్పలేకపోయారట. గణపతి కూడా శివునికి సందేశాన్ని తెలియజేయలేకపోయాడట ఆ సమయంలో గణపతి కూడా నందీశ్వరుని ద్వారా శివునికి సందేశాన్ని అందించాడని పురాణాలో చెప్పబడింది. ఆ తర్వాత నుంచి నంది ద్వారా శివునికి మన కోరికలు ఏవైనా చెప్పినట్లయితే, అవి నెరవేరుతుందని నమ్మేవారట. మరోవైపు, శివుడి (Lord Siva) తో పాటు నందీశ్వరుని పూజించకపోతే, శివుని పూజ అసంపూర్తిగా మిగిలిపోతుందని అలాగే విఘ్నేశ్వరుడికి ఏదైనా కోరిక చెప్పాలంటే ఎలుకతో చెవిలో చెప్పే ఆచారం కూడా ఉందని అని పండితులు చెబుతున్నారు.