జూలై 11న జరిగిన GST కౌన్సిల్ యొక్క 50వ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్ పై 28 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ఆన్లైన్ గేమింగ్ విషయంలో నైపుణ్యం మరియు అదృష్టం (Skill and Luck) యొక్క తేడాలను తొలగించాలని కౌన్సిల్ నిర్ణయించిందని మరియు బెట్టింగ్ జరిగిన పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించబడుతుందని మహారాష్ట్ర అటవీ, సాంస్కృతిక మరియు మత్స్య శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ తెలిపారు.
$10 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ..
భారత్ లో చవకైన ఇంటర్నెట్ మరియు టెక్నాలజీ వినియోగంతో, ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ దేశం లో 400 మిలియన్లకు పైగా వినియోగదారులతో దాదాపుగా $10 బిలియన్ల డాలర్ల మార్కెట్ విలువ కలిగి ఉంది. GST కౌన్సిల్ తాజాగా విధించిన 28 శాతం పన్నుతో ఇప్పుడు ఒక గేమ్పై ఖర్చు చేసే రూ. 100కి రూ. 1.8 రూపాయల టాక్స్ నుంచి ఏకంగా రూ. 100కి రూ. 28 రూపాయలకు పన్ను పెరిగింది. జి ఎస్ టి కౌన్సిల్ పెంచిన పన్ను వళ్ళ భారత్ లో బెట్టింగ్ ఆడే ఆటగాళ్లను ఆడకుండా నిరుత్సాహపరచడమే కాకుండా వారిని 28 శాతం పన్ను నుంచి తప్పించుకోవడానికి ఆఫ్షోర్ బెట్టింగ్ ప్లాట్ఫారమ్ (International Betting Websites) లలో ఆడటానికి వారిని బలవంతం చేస్తుందని గేమింగ్ ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయపడ్డారు.
క్రికెట్ ఫాంటసీ ఇండస్ట్రీ ఇక లేనట్టేనా..?
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్ ఫాంటసీ గేమింగ్ కంపెనీ లైన డ్రీం 11 (Dream 11) మరియు క్రిక్ పే (CRICPE) లు చావు దెబ్బ తిన్నట్టే అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయ పడ్డాయి. కేంద్ర నిర్ణయం పైన క్రిక్ పే యజమాని ఆశ్నీర్ గ్రోవర్ తీవ్రంగా మండిపడుతూ “ఫాంటసీ గేమింగ్ పరిశ్రమలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది, తాజా కేంద్ర నిర్ణయంతో $10 బిలియన్ డాలర్ల ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ చనిపోతుంది” అని ఆయన మండిపడ్డారు.
RIP – Real money gaming industry in India. If the govt is thinking people will put in ₹100 to play on ₹72 pot entry (28% Gross GST); and if they win ₹54 (after platform fees)- they will pay 30% TDS on that – for which they will get free swimming pool in their living room come…
— Ashneer Grover (@Ashneer_Grover) July 11, 2023