(E-HIGHWAY)
వందే భారత్ ఎక్స్ ప్రెస్ లతో ప్రజా రవాణా వ్యవస్థలో మేలు మలుపు సృష్టించిన కేంద్రం ఇప్పుడు మరో సంచలనానికి తెర తీయబోతోంది. అదే ఎలక్ట్రిక్ హై వేస్ నిర్మాణం. మొట్టమొదటి ఎలక్ర్టిక్ హైవే ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా నాగ్ పుర్ లో చేపడతామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు,పెట్రోల్, డీజిల్ ఖర్చుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర సర్కార్ భారీ ప్రణాళికలు వేస్తున్న విషయం తేలిసిందే.ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి వాహనాలకు మెరుగైన సేవలు అందిస్తోంది. విద్యుత్తో నడిచే రైళ్ల మాదిరిగానే ఇక వాహనాలు కూడా నడవనున్నాయి. హైవేల వెంట ఎలక్ర్టిక్ వైర్లను ఏర్పాటు చేసిన వాహనాలు విద్యుత్తో నడిచే విధంగా ప్లాన్ చేస్తుంది కేంద్రం.
ఇక ఢిల్లీ -ముంబై మధ్య ఎలక్ర్టిక్ హైవే నిర్మించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, అక్కడ ఓవర్ హెడ్ వైర్ల సాయంతో వాహనాలకు విద్యుత్ సరఫరా చేస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలను నాలుగు లేన్ల రహదారితో అనుసంధానించాలని ఆయన మంత్రిత్వ శాఖ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నటు తేలుస్తుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు భారీ వాహన యజమానులందరూ ప్రత్యామ్నాయ ఇంధనాలైన ఇథనాల్, మిథనాల్, గ్రీన్ హైడ్రోజన్ ఈజ్లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ కోరుతోంది.
ఎలక్ట్రిక్ హైవే నిర్మాణం ఎలా? (E-HIGHWAY)
ఎలక్ట్రిక్ హైవే(E-HIGHWAY) అంటే వాహనాలు ఈ రహదారులపై వెళ్తున్న క్రమంలో ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ సరఫరా చేస్తారు. రైల్వే ట్రాక్ల మాదిరిగానే ఈ విద్యుత్ లైన్లు ఉంటాయి. హైవే పొడవున ఓవర్ హెడ్ విద్యుత్ లైన్లతో కరెంట్ సరఫరా జరుగుతుంది.. ట్రాలీ బస్సులు, ట్రాలీ ట్రక్కులను ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని నిర్మూలించడంతో పాటు రవాణా సామర్థ్యం కూడా పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఈ విద్యుత్ లైన్లను అన్ని జిల్లా కేంద్రాలను నాలుగు లైన్ల రహదారులతో అనుసంధానం చేయనున్నారు. రవాణా కార్యాలయాల్లో అవినీతి పెరుగుతుండటంతో, ఆర్టీఓల ద్వారా అందే సేవలను డిజిటలైజ్ చేస్తామని మంత్రి వెల్లడించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను తగ్గించడమే తమ లక్ష్యమని అన్నారు.
దీని కారణంగా భారీ వాహనాలు కూడా అధిక వేగంతో నడపగలవు. ఈ హైవే నుండి కాలుష్యం కూడా తక్కువగానే వ్యాపిస్తుంది. సాధారణంగా ఇలాంటి రోడ్డుపైనే విద్యుత్తు సరఫరా అవుతుంది. కదిలే వాహనాలు. ఈ విద్యుత్ను రోడ్డుపై అమర్చిన వైర్ల ద్వారా వాహనానికి చేరవేస్తుంది. రైలు లేదా మెట్రో రైలులో ఇంజిన్పై విద్యుత్ వైర్లకు కనెక్ట్ చేయడానికి పాంటోగ్రాఫ్ ఎలా అమర్చబడిందో, ఎలక్ట్రిక్ హైవేపై కూడా అలాంటిదే కనిపిస్తుంది.
ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్ డీజిల్కు ప్రత్యామ్నాయంగా ఈ హైవేని చూస్తోంది. ఈ హైవే ద్వారా కాలుష్యాన్ని నియంత్రించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ రహదారిని అందుబాటులోకి తీసుకొస్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు వైపు ఒక పెద్ద అడుగులు వేస్తాం అన్ని గడ్కరి తెలిపారు.
ఎలక్ట్రానిక్ వాహనాలపై దృష్టి పెట్టడమేకాకుండా… ఎలక్ట్రానిక్ వాహనాల భవిష్యత్తును మెరుగుపరచడానికి, ఇప్పుడు భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ హైవేను రూపొందించాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ హైవే ఏ సాధారణ హైవే లాగా ఉండదు. ఈ హైవేను ప్రత్యేకంగా డిజైన్ చేయనున్నారు. హైవేపై ఎలక్ట్రిక్ వాహనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక లేన్ను తయారు చేయనుంది, దానిపై కేబుల్తో నడిచే ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ బస్సులు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి.