చైనాలో భారీ భూకంపం సంభవించింది. ఈరోజు తెల్లవారు జామున జరిగిన భూకంపంలో 21 మంది మరణించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.4 నమోదయినట్లు యూఎస్ జియోలాజికల్ సంస్థ మీడియాకు తెలిపింది. అనేక భవనాలను నేలమట్టం కావడంతో వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
తెల్లవారు జామున…
చైనా తూర్పు ప్రాంతంలో ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు. దక్షిణ పెజోలోన శాండింగ్ ప్రావిన్స్ లోని తెల్లవారు జామున 3.30 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు చెబుతున్నారు. దీతో ప్రజలు ఇళ్లలో నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు నిద్రమత్తులోనే మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. ఈ భూకంప తీవ్రత కారణంగా భవనాల నేలమట్టమయినట్లు అధికారులు తెలిపారు.
126 భవనాలు నేలమట్టం…
భూకంపం ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతున పుట్టిందని యూఎస్ జియోలాజికల్ సంస్థ వెల్లడించింది. ఈ ప్రభావంతో 26 కిలో మీటర్ల దూరంలో ఉన్న భవనాలు దెబ్బతిన్నాయన్నారు. దాదాపు 126 భవనాలు నేలమట్టమయ్యాయయని, పెద్ద యెత్తున ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. బాధితుల ఆర్తనాదాల మధ్య శిధిలాల నుంచి మృతదేహాల తొలగింపు కార్యక్రమం ప్రారంభమయింది.