అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6 తీవ్రతగా నమోయిందని అధికారులు వెల్లడించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు భయకంపితులై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రాణ, ఆస్తి నష్టం…
అయితే ప్రాణ, ఆస్తినష్టంపై మాత్రం ఇంతవరకూ అధికారులు ఎలాంటి సమాచారం అధికారికంగా ఇవ్వలేదు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని అంచనాలు మాత్రం వినపడుతున్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపాలు సాధారణమైనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో నష్టం ఎంత అనేదానిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది.