తెలుగు దేశం తాజా పరిణామాలను చూసిన వారికి మహారాష్ట్ర రాజకీయాలు గుర్తు రాకమానవు. ఇప్పటికిప్పుడు ఈ పరిణామాలను విశ్లేషించడం తొందరపాటే అయినా.. ఒకవేళ అలా జరుగుతుందా అన్న సంశయం మాత్రం రాక మానదు. ఎందుకంటే బీజేపి మాస్టర్ ప్లాన్ అలా ఉంటుంది మరి.. మహారాష్ట్రలో శివసేన కాంగ్రెస్ తో అంటకాగి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చిరకాల మిత్రపక్షమైన బీజేపీని కాదని పదవి కోసం ఉద్ధవ్ థాకరే కాంగ్రెస్ తో దోస్తీ చేయడం మహా అగాధా కూటమిని ఏర్పాటు చేయడం బీజేపీకి రుచించలేదు. తమకి దాసోహం అనకపోతే ఎంతటి వారనైనా ఎలా లొంగ దీసుకోవాలో అమిత్ షా, మోడీలకు తెలిసినంత బాగా మరెవరికి తెలియవు. అక్కడ శివసేనను కూడా నిట్ట నిలువునా చీల్చి చీలిక వర్గానికి ఏకనాథ్ షిండే ను లీడర్ గా పైకి చూపించి వెనకాల కర్త, కర్మ,క్రియ అన్నీ తానే అయి బీజేపీ వ్యవహరించింది. ఏకనాథ్ షిండే చీలిక వర్గాన్ని పరాయి రాష్ట్రంలో పెట్టి క్యాంప్ రాజకీయాలు చేయడమే కాదు కోర్టులోనూ శివసేన సింబల్ విషయంలో ఏక్ నాథ్ కు అనుకూలంగా తీర్పు వచ్చిన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదు.ఇప్పుడు ఏపీ AP టీడీపీ పరిణామాలు గమనిస్తే..
ఇంచుమించు అదే దిశగా సాగుతున్నాయా అన్న అనుమానాలు రాకమానవు..కొన్నాళ్ల క్రితం అమిత్ షా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ను కలవడం,ఆర్ ఆర్ ఆర్ మూవీకి అస్కార్ అవార్డు వచ్చినప్పుడు ఢిల్లీలో జూనియర్ ను ఇంటికి పిలిచి మరీ విందు ఇవ్వడం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి.దీనికి తోడు రెండు, మూడు రోజుల క్రితం ఢిల్లీలో పురంధరేశ్వరి జూనియర్ ను ఆకాశానికెత్తేస్తూ పొగడటం చూస్తుంటే ఏదో జరుగుతోందనే అనిపిస్తోంది.
కంగు తిన్న టీడీపీ AP
తెలుగు దేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై అవినీతి ఆరోపణలతో ఏపీ AP రాజకీయాల్లో ప్రకంపనలు రేగాయి. అసలే అయోమయంలోఉన్నపార్టీ శ్రేణులకు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదు.. టీడీపీ చీలిక తధ్యమని ఆ చీలిక వర్గానికి జూనియర్ నాయకత్వం వహిస్తారని ఊహాగానాలు రేగుతున్నాయి. ఇప్పటికే ఏపీలో AP బలహీనంగా ఉన్నబీజేపీకి పట్టు చిక్కాలంటే టీడీపీని చీల్చడమొక్కటే ఎత్తుగడ. చీలిక వర్గానికి జూనియర్ ను నాయకుడిని చేయడం ద్వారా బీజేపీ, టీడీపీ కలసి అడుగులేసే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దీనికి తాజాగా ఏపీ బీజేపి అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఈ మధ్య మాట్లాడిన మాటలు మరింత ఊతమిస్తున్నాయి.
అందుకే అలా మాట్లాడారా?
ఢిల్లీలో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల సందర్భంగా పురంధరేశ్వరి మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ కు జూనియర్ ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానమని అన్నారు. సొంత కొడుకులకన్నా జూనియర్ ను ఎక్కువ ప్రేమించారని అన్నారు.ఎన్టీఆర్ బతికుంటే జూనియర్ ఎన్టీఆర్ నే తన వారసుడిగా ప్రకటించేవారనే అర్ధం వచ్చేలా పురంధరేశ్వరి మాట్లాడారు.
బీజేపీ హైకమాండ్ పెద్దలనుంచి ఏదో మార్గదర్శకత్వం లేదా సంకేతాలు అందకపోతే పురంధరేశ్వరి ఈ మాటలు మాట్లాడేవారు కాదు.
అంతేకాదు పురంధరేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వైఖరి మీద తీవ్ర అసంత్రుప్తి ఉంది. ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేసి పగ్గాలు తీసుకున్నాక దగ్గుబాటిని చంద్రబాబు దూరంపెట్టి అవమానాల పాల్చేశారు. ఈకారణాల వల్ల కూడా చంద్రబాబుపై కసి తీర్చుకోవాలనే ఉద్దేశాలు ఉండొచ్చు.
పరిణామలను విశ్లేషిస్తే టీడీపీని నిట్టనిలువుగా చీల్చాలన్నది బీజేపీ ఎత్తుగడగా కనిపిస్తోంది. ఆ చీలిక వర్గానికి జూనియర్ ను అధిపతిని చేసి అదే అసలైన టీడీపీ అని ప్రకటించేలా చేయవచ్చు.. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీ, చీలిక వర్గం టీడీపీ పొత్తు పెట్టుకుని పోటీ చేయవచ్చు. లేదా బీజేపీలో ఈ చీలిక వర్గాన్ని విలీనం చేయవచ్చు. ఇది రాజకీయ విశ్లేషకులు చేస్తున్న ఒక ఎనాలిసిస్.. పరిణామాలు ఎలా ఉన్నా..
హిస్టరీ రిపీట్ అవుతుందా?
ఇదే గనక జరిగితే చంద్రబాబు మాత్రం ఒక నానుడిని గుర్తు చేసుకోవాలి.. తాడిని తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడని..
అప్పట్లో ఎన్టీఆర్ ను అత్యంత అవమానకరంగా గద్దె దింపి .. పదవిని లాక్కుని.. ఆపై పార్టీ సింబల్ ను కూడా లాగేసుకున్న ఘనత చంద్రబాబుది.. విశ్లేషకుల అంచనాలు గనక నిజమైతే చంద్రబాబు రాజకీయానికి ఇది టిట్ ఫర్ టాట్..
వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం AP
చంద్రబాబునాయుడుపై ఐటీ శాఖ ఆరోపణల నేపధ్యంలో టీడీపీలో కల్లోలం రేగుతోంది. అసలే అభద్రతా భావంలో ఉన్న ఆ పార్టీకి తాజా పరిణామాలు మింగుడుపడటం లేదు. చంద్రబాబు వంద నిర్ణయాలను/తప్పులను ఎత్తి చూపుతూ శిశుపాలుడి నూరుతప్పులు అయిపోయాయని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై టీడీపీ వర్గాలు పూర్తి మౌనం పాటిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ వర్గాలు కూడా తాజా పరిణామాల పట్ల విస్తుపోయాయి. జనసేన కూడా పూర్తిగా మౌనం దాల్చింది.