పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో పాటు కాలుష్యం కూడా అధికం కావడంతో ఎక్కువ మంది ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్లు, టూ వీలర్ల కొనుగోళ్లు కూడా అధికమయ్యాయి. కార్ల తయారీ సంస్థలు దాదాపు అన్నీ తమ ఉత్పత్తుల్లో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి. ప్రయాణ ఖర్చు తగ్గిపోతుండటంతో ప్రజలు కూడా వీటిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం…
అయితే ప్రస్తుతం విద్యుత్తు ఛార్జింగ్ పాయింట్లు తక్కువగా ఉండటం, తమ ఇంటి నుంచి వచ్చే విద్యుత్తు ద్వారా వాహనాలను చార్జి చేసుకోవడం వంటివి చేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే అంత దూరం బ్యాటరీ పనిచేయదేమోనన్న భయం వినియోగదారుల్లో ఉంది. అందుకే ప్రభుత్వం విద్యుత్తు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమయింది. వీటి ద్వారా నామమాత్రపు వసూలుకు విద్యుత్తును ఛార్జి చేస్తారు.
ఏపీలోనూ…
అయితే ఆంధ్రప్రదేశ్ లోనూ సోలార్ విద్యుత్తు ఛార్జింగ్ పాయింట్లు పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కొత్తగా పన్నెండు చోట్ల ఈ విద్యుత్తు ఛార్జింగ్ పాయింట్లను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అనంతపురం, తిరుపతి, విజయవాడ నగరాల్లో ఈ విద్యుత్తు ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు. సౌర విద్యుత్తు ద్వారా నగరాలకు దూరంగా ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇవి అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింత పెరిగే అవకాశముందని, తద్వారా కాలుష్యం కూడా తగ్గుతుందంటున్నారు వినియోగదారులు.