మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులోని ఆయన ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. అందిన సమాచారం మేరకు రాయపాటి నివాసంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
గుంటూరులోని…
కాగా రాయపాటి సాంబశివరావు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆయన హైదరాబాద్ లో ఉన్నారు. దీంతో గుంటూరులో రాయపాటి నివాసంలో ఉన్న ఆయన కుమారుడు రాయపాటి రంగారావును ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏ విషయంపై ఈడీ సోదాలు చేస్తున్నారు? కారణాలేమిటి అన్న వివరాలు తెలియాల్సి ఉంది. సోదాలు ముగిసిన తర్వాతనే అసలు విషయం తెలిసే అవకాశముంది.