హైదరాబాద్ లోనూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు పదిహేను బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. మలినేని సాంబశివరావు ఇంట్లోనూ, కార్యాలయంలోనూ ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈరోజు తెల్లవారు జామునుంచే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మలినేని సాంబశివరావు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు. బ్యాంకుల నుంచి 9,394 కోట్ల రూపాయల రుణాన్ని ఈ కంపెనీ తీసుకుంది. ఈ రుణాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లించలేదు.
మనీలాండరింగ్కు…
అయితే మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. దీనిపై ఇప్పటికే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు మరికొన్ని సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అందిన సమాచారంతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఏకకాలంలో జరుగుతున్న ఈ సోదాలు కలకలం రేపుతున్నాయి. జూబ్లీహిల్ల్స్, మణికొండ, పంజాగుట్టలోని కార్యాలయాలు, ఇళ్లలో ఈ సోదాలు జరుగుతున్నాయి. మలినేని సాంబశివరావు ట్రాన్స్ ట్రాయ్ తో పాటు పాటు టెక్నో యూనిట్ ఇన్ ఫ్రా టెక్, కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, ట్రాన్స్ ట్రాయ్ రోడ్డుప్రాజెక్టుకలకు డైరెక్టర్ గా ఉన్నారు.