ప్రస్తుత సమాజంలో ఆస్తిపాస్తులకు ఇచ్చే విలువ సాటి మనుషులకు ఇవ్వడం లేదు. ఆస్తి కోసం అన్న దమ్ములు చంపుకోవడం ఇలా చాలా చుస్తునే ఉంటాం. ఆస్తి కోసం కుటుంబ సభ్యుల ప్రాణాలు తీయడానికైనా కొందరు వెనుకాడరు. అయితే ఇప్పుడు ఆస్తుల కోసం ఏకంగా కన్న కుతుర్నే చంపిన ఓ తండ్రి. ఎమాత్రం కనికరం లేకుండా ఐదు నెలల గర్భిని అని కూడా చూడకుండా వెంటాడి వెటాడి చంపాడు ఓ తండ్రి తాజాగా ఖమ్మం జిల్లాలో ఆస్తికోసం ఏకంగా కన్న కూతురినే హతమార్చాడు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తిపాస్తుల ముందు మానవ సంబంధాలు మంటగలిచాయి.
కన్నపేగుకన్న ఆస్తే మిన్న అనుకున్న ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం కన్నబిడ్డనే కడతేర్చాడు ఆ
కసాయి తండ్రి . వివరాల్లోకి వెళ్తే..వైరా మండలం తాటిపూడి గ్రామంలో భూమి వివాదాలు, ఆస్తుల విషయంలో
పిట్టల రాములు అనే వ్యక్తికూతురు ఉష, అల్లుడు కృష్ణపై దాడి చేశాడు. కూతురు మరణించగా అల్లుడు కృష్ణ
పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అంబులెన్స్లో హస్పటల్ కి తరలించారు. సమాచారం అందుకున్న
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి
ఉంది.
తాటిపూడికి చెందిన పిట్టల రాములు, మంగమ్మ దంపతులకు కుమారులు నరేశ్, సురేశ్, వెంకటేశ్తోపాటు
కుమార్తె ఉషశ్రీ కూడా ఉంది. చిన్ననాటి నుంచి తాతయ్య మన్యం వెంకయ్య మనవరాలు ఉషశ్రీని పెంచిపెద్ద
చేశారు. పదేళ్ల క్రితం పరిసబోయిన రామకృష్ణతో పెళ్లి చేశారు. ఆమె ఆలనాపాలనా చూసిన తాతయ్య వెంకయ్య
పెళ్లి సమయంలో మనవరాలు ఉషశ్రీకి వ్యవసాయ పొలంతోపాటు గ్రామంలోని ఇల్లు, స్థలం ఇచ్చారు. వీరు కూడా
తాటిపూడిలోనే ఉండేవారు. కొన్నేళ్ల క్రితం వెంకయ్య మృతి చెందారు. వెంకయ్యకు మంగమ్మ ఒక్కరే కుమార్తె.
పుట్టింటి వారె కక్ష….
మనవరాలికి వెంకయ్య ఎక్కువ ఆస్తి ఇచ్చారంటూ ఉషశ్రీ, రామకృష్ణలపై ఆమె పుట్టింటి వారు కక్ష పెంచుకున్నారు.
ఉషశ్రీ దంపతులపై ఆమె తండ్రి, సోదరులు కోర్టుకు వెళ్లారు. ఆస్తి తమకే దక్కాలంటూ ఇరువర్గాలు కొన్నేళ్లుగా
న్యాయపోరాటం చేసారు. దీనిపై గ్రామంలో పంచాయితీలు, ఘర్షణలు జరిగాయి. కేసులు కూడా నమోదయ్యాయి.
ఇలా ఉండగా ఉషశ్రీ, రామకృష్ణలకు చెందిన ఇంటి ఆవరణలో సుబాబుల్ చెట్లున్నాయి. వీటిని నరికే విషయంలో
ఉషశ్రీ దంపతులకు, పుట్టింటి వారికి మధ్య శుక్రవారం వాగ్వాదం చోటుచేసుకుంది. సుబాబుల్ ఉన్న భూమి
మాదంటే మాదంటూ ఇరువర్గాలు వాదనకు దిగాయి. ఇద్దరి ఇళ్లూ దగ్గరదగ్గరే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గొడవ
పెద్దది కావడంతో పిట్టల రాములు, నరేశ్, వెంకటేశ్లు తమ వెంట తెచ్చుకున్న కొడవళ్లు, గొడ్డలి, పారతో పాటు
రాళ్లు విసురుతూ ఉషశ్రీ దంపతులపై దాడి చేశారు.
ఎమాత్రం కనికరం లేకుండా వెంటాడి మరి దారుణ హత్య……
భయంతో రామకృష్ణ, ఉషశ్రీ చెరోవైపు పరుగులు తీశారు. ముందుగా వారు రామకృష్ణపై విచక్షణారహితంగా దాడి
చేయడంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఉషశ్రీ రోడ్డు దాటి ఓ బజారులో పరుగులు తీస్తుండగానే వెంట పడిన
తండ్రి, సోదరులు దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలు అయిదు నెలల గర్భిణి అని
స్థానికులు తెలిపారు. అల్లుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో పిట్టల రాములు, వెంకటేశ్లకూ
గాయాలయ్యాయి. ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.