కరోనా తర్వాత చిన్న పెద్ద అని తేడా లేకుండా రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. అందులోనూ ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇదివరకు 50 సంవత్సరాల వయసు పైబడిన వారికే గుండె సంబంధిత వ్యాధులు వచ్చేవి కానీ ఇప్పుడు ఇదంతా మారిపోయింది చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించే వారిని మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే వీటిని తీసుకుంటే చాలు.
గుండెకు సంబంధించిన వ్యాధులు బారిన పడకుండా ఉండటానికి మన ఆహారంలో “పండ్ల, కూరగాయలు చేపలు తీసుకోవడం మంచిది. వీటివల్ల మధుమేహము తగ్గుతుంది హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.కొంతమంది పెరుగు శరీరానికి చలవ అని అధిక మోతాదులో తీసుకుంటూ ఉంటారు. ఏదైనా మోతాదుకు మించితే అది మంచిదైనా మన శరీరానికి విషయమే కాబట్టి పెరుగును కూడా తగిన మోతాదులో తీసుకోవడం మంచిది. ఇది మన శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది అలాగే హృదయ స్పందన రేటును కూడా నియంత్రిస్తుంది.
ఆకుకూరలు ఎక్కువగా తినడం మంచిది ఒక్క గుండెకే కాదు ఆ కూరలు మన శరీరంలో తలెత్తే ఏ సమస్యలకైనా ఆకుకూరలు, కూరగాయలు మంచివని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు, నైట్రేట్లు పుష్కలంగా, సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఇవి పీచు పదార్థం కావడంతో సులభంగా జీర్ణమై జీర్ణ కోసం సంబంధిత సమస్యలు కూడా రాకుండా నివారిస్తాయి. అంతేకాకుండా ఇవి గుండెకు సంబంధించి లేదా మన శరీరంలోని రక్తనాళాలను శుభ్రపరిచి ఆక్సిజన్ రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తుంది తద్వారా గుండె సమస్యలను కూడా నివారిస్తుంది.
పాలకు, ఆవాలు, మెంతికూరలను రోజు తినడం కూడా మంచిదే అని చెబుతున్నారు వైద్యులు. మనలో చాలామందికి ఐరన్ లోపం ఉందని వైద్యులు చెబుతూ ఉంటారు. అందుకోసం మందులు కూడా సూచిస్తూ ఉంటారు కానీ ఇవేవీ లేకుండా పాలకు ఆవాలు మెంతికూరలు తింటే ఐరన్ లోపం కూడా తొలగిపోతుందని, అలాగే గుండె ఆరోగ్యంగా కూడా ఉంటుందంటున్నారు . వీటితో పాటు వాల్నట్స్ కూడా తినడం మంచిదని అందువలన కొలెస్ట్రాంగ్ స్థాయిలు తగ్గుతాయని వైద్యులు నిపుణులు చెబుతున్నారు.