నిజం గెలవాలంటూ బస్సు (BUS) యాత్ర చేపట్టిన నారా భువనేశ్వరి టీడీపీ శ్రేణులు ఆశించిన స్థాయిలో జనాన్ని ఆకట్టుకోలేకపోతున్నారు.. ఇన్నాళ్లూ భర్త వెంట భార్యగా మసలు కొన్న ఆమె ఇప్పుడు ఒంటరిగా టీడీపీ ప్రచార బాధ్యతలను నెత్తికెత్తుకున్నట్లయ్యింది. టీడీపీ ఏడు లక్షలు ఖర్చు పెట్టి ముంబై నుంచి తయారు చేయించి తెప్పించిన బస్సు హంగు, ఆర్భాటాలకు సరిపోయింది కానీ, ప్రజల్లో సింపతీని కూడగట్టుకోవాలన్న టీడీపీ ప్రయత్నాలు మాత్రం కలసి రావడం లేదు. అనకూడదు గానీ తెలుగును విశ్వ విఖ్యాతం చేసినది నందమూరి తారక రామారావే అయినా ఆయన పిల్లలకు మాత్రం వాక్ శుద్ధి అస్సలు అబ్బలేదు. బాలకృష్ణ నుంచి భువనేశ్వరి వరకూ ఎవరూ స్వచ్ఛమైన, శుద్ధమైన తెలుగు మాట్లాడలేరు. బాలయ్య మాట్లాడతారు కానీ.. చాలా తడుముకుని, తడుముకుని మాట్లాడతారు. అనర్గళమైన తెలుగు మాట్లాడలేరు.. ఇక పురంధరేశ్వరి ఒక్కరే కాస్త స్పష్టమైన తెలుగు మాట్లాడతారు. మిగతా నందమూరి వారసులంతా భువనేశ్వరి లాగే.. భువనేశ్వరి గారికి ప్రజల్లో తిరగడం ఇదే మొదటి సారి కాబట్టి తెలుగు తడబడుతున్నారా లేక మరే ఇతర కారణాలైనా ఉన్నాయా అన్నది మాత్రం తెలీదు.
నీరసంగా నిజం గెలవాలి యాత్ర (BUS)
మొత్తం మీద అట్ట హాసంగా మొదలు పెట్టిన నిజం గెలవాలి బస్సు యాత్ర నీరసంగా, నిట్టూరుస్తూ సాగుతోంది. బాధిత కుటుంబాలను కలసి నప్పుడు ఆవేదన భువనేశ్వరి ముఖంలో లేదు. ఆ బాడీ లాంగ్వేజ్ లో భావోద్వేగం లేదు. అక్కడకు వెళ్లి కూడా చంద్రబాబు జైల్లో కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు అంటూ భర్తనే పొగుడుతూ కానిచ్చేస్తున్నారు. మరోవైపు ఆమె వెంట కనీసం బాలయ్య గానీ, లోకేష్ కానీ లేకపోవడం వల్ల కూడా ఆమె ఒంటరి తనం ఫీలవుతూ ఉండొచ్చు..
కడిగిన ముత్యంలా ఎలా వస్తారు?
మొత్తానికి స్కిల్ స్కామ్ గురించి పల్లెత్తు మాట మాట్లాడకుండా ఆమె దాట వేస్తూ పర్యటన కానిచ్చేస్తున్నారు. అది స్కామ్ కాదని అక్కడా, ఇక్కడా, మీడియా ముందు మాట్లాడేసే టీడీపీ నేతలు ఇంటింటికీ వెళుతున్నప్పుడు ఆ స్కామ్ లో బాబు ఎలా నిర్దోషో చెప్పగలగాలి కదా.. ఆ వివరణ మాత్రం ఇవ్వడం లేదు. ఎంతసేపు చంద్రబాబు వయసును, హోదాను, అనుభవాన్ని ప్రస్తావిస్తున్నారు.. ప్రజల కోసం ఆయన తప్ప మరెవరూ పాటుపడలేరంటూ గప్పాలు కొడుతున్నారు తప్ప తమపై పెట్టిన కేసులు ఎలా తప్పుడు కేసులో మాత్రం చెప్పడం లేదు.స్కిల్ స్కామ్, అమరావతి భూముల స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ స్కామ్ ఇలా జగన్ ప్రభుత్వం బొచ్చెడు అవినీతి కేసులు బనాయించింది. ఎంత సేపు బాబు గారు కడిగిన ముత్యంలా బయటకొస్తారు అనడమే తప్ప ఆ కేసులన్నీ ఎలా తప్పుడు కేసులో, లేదా తమపై ఎలా అక్రమంగా బనాయించారో మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇంత ఖర్చు పెట్టుకుని, ప్రజల టైము, తన టైము వృథా చేసుకుని నిజం గెలవాలంటూ బస్సులో తిరిగేస్తే ఓట్లు రాలతాయా? భువనేశ్వరికి సరైన గైడెన్స్ కూడా పార్టీ శ్రేణులు ఇస్తున్నట్లు కనిపించడం లేదు. (BUS)
మొక్కు బడి పలకరింపులు..
చివరకు అగరాలలో ఆమె మొదట కలసిన బాధిత కుటుంబం ఇంటి ప్రాంగణంలో టీడీపీ హడావుడి గానీ, జన సందోహం గానీ, సమూహం కానీ కనిపించలేదు. బాధిత కుటుంబాలను కలవడం, పలకరించడం, పరామర్శించడం మొత్తం ఏ టు జెడ్ వైసీపీ ఓదార్పు యాత్రను కాపీ కొట్టినా.. జనం ప్రేమని మాత్రం సంపాదించలేకపోయారు. ఏదైనా చంద్రబాబు తర్వాత టీడీపీలో జనాకర్షణ కలిగిన నేతలెవరూ లేరని తేలిపోయింది. చంద్రబాబుకు చరిష్మా కృత్రిమమైనదా లేక, డబ్బులిచ్చి జనాన్ని తెచ్చారా అన్న విషయాన్ని పక్కన పెడితే ఆయన సభలకు జన సందోహం బాగా కనిపించేది.. యువగళానికి కూడా బలవంతంగా సమీకరించి బలం, బలగాన్ని ప్రదర్శించారు. భువనేశ్వరి సభలకు మాత్రం పెద్దగా జన సందోహమే లేదు. ఆమెను టీడీపీ శ్రేణులే రాజకీయంగా ఒంటరిని చేసేశాయా అనిపిస్తోంది. మొత్తానికి నారావారి బస్సు యాత్ర భువనేశ్వరికి అష్ట కష్టాలను తెచ్చి పెడుతోంది.. ఇదే టైమ్ లో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర మొదలవడం కూడా భువనేశ్వరి యాత్రకి దెబ్బే..వైసీపీ బస్సు యాత్రతో పోటీ పడి టీడీపీ అనవసరంగా కెలుక్కుందా? (BUS)