కేరళ కాంగ్రెస్ లో విషాదం నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఉమెన్ చాందీ మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమెన్ చాందీ ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలం నుంచి బెంగళూరులో చికిత్స పొందుతున్నారు. ఉమెన్ చాందీ మృతితో కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నేతను కోల్పోయినట్లయింది.
రెండుసార్లు సీఎంగా…
ఉమెన్ చాందీ కేరళలో కాంగ్రెస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. రెండు సార్లు ఆయన కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. పన్నెండు సార్లు కేరళ అసెంబ్లీకి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. సుదీర్ఘకాలం పనిచేసిన ఎమ్మెల్యేగా గుర్తింపు పొందారు. ఉమెన్ చాందీ మృతి పట్ల కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఉమెన్ చాందీ పార్ధీవదేహాన్ని బెంగళూరు నుంచి తిరువనంతపురానికి తరలించారు. కాంగ్రెస్ అగ్రనేతలందరూ ఉమెన్ చాందీ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.