పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు పడింది. ఐదేళ్ల పాటు అనర్హత వేటు న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. తోషఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించింది. ఇమ్రాన్ ఖాన్ కు మూడేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమాను విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. ప్రధానిగా తనకు అందిన బహుమతులను ఇమ్రాన్ ఖాన్ విదేశాల్లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడన్న ఆరోపణలపై న్యాయస్థానం విచారణ చేసింది.
తోషఖానా కేసులో…
ప్రధానిగా ఆయనకు అందిన బహుమతులను అమ్మగా వచ్చిన సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సి ఉండగా, సొంతగా వినియోగించుకోవడం నేరమని తెలలపింది. ఇదివరకే పాకిస్థాన్ ఎన్నికల సంఘం ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు వేసింది. తప్పుదు అఫడవిట్ సమర్పించాడని కూడా ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే న్యాయస్థానంలో కూడా ఇమ్రాన్ ఖాన్ కు చుక్కెదురయింది. ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో రానున్న ఎన్నికల్లో ఇమ్రాన్ పోటీపై సందిగ్దం నెలకొంది.