(Gnt)
మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ మరోసారి పోటీకి సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన పార్లమెంటులో అడుగు మోపాలని తహతహలాడుతున్నారు. ఇప్పటికే పదేళ్ల నుంచి రాజకీయాలకు దూరమైన లగడపాటి రాజగోపాల్ ఈసారి పోటీ చేసి గెలుపొంది తానేంటో చూపాలని భావిస్తున్నారు. అందుకే ఆయన రాజకీయంగా రెడీ అవుతున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. లగడపాటి రాజగోపాల్ తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఆయన సన్నిహితులు కూడా సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న లగడపాటి ఆ తర్వాత ఎన్నికల జోలికి పోలేదు. వ్యాపారాలకే పరిమితమయ్యారు.
పదేళ్లపాటు ఎంపీగా…
లగడపాటి రాజగోపాల్ చిన్న వయసులోనే పారిశ్రామికవేత్తగా మాత్రమే కాదు. రాజకీయ నాయకుడిగా ఎదిగారు. మాజీ కేంద్ర మంత్రి ఉపేంద్ర అల్లుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన లగడపాటిని విజయవాడ పార్లమెంటు నియోజవర్గ ప్రజలు రెండు సార్లు ఆదరించారు. 2004, 2009 లో ఆయన విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వత్తిడిని తెచ్చారు. చివరకు పార్లమెంటులో పెప్పర్ స్ప్రే చల్లి సంచలనానికి కారణమయ్యారు. అయితే రాష్ట్ర విభజన జరిగితే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని శపథం చేశాడు. సవాల్ మీద సవాల్ విసిరాడు. రాష్ట్ర విభజన జరగదన్న నమ్మకమే ఆయనను ఆ ప్రకటన చేయించిందంటారు. కానీ విభజన జరిగిపోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంతో ఆయన అన్న మాట మీద ఇప్పటి వరకూ నిలబడ్డారు. కానీ పదేళ్లు కావస్తుంది. పదేళ్ల తర్వాత కూడా శపథం ఏంటని? రాజకీయాల్లోకి రావాలని
విభజన తర్వాత… (Gnt)
అయితే రాష్ట్ర విభజన జరగడంతో ఆయన తాను చేసిన సవాల్కు కట్టుబడి ఉన్నారు. రాజకీయంగా దూరమయ్యారు. వ్యాపారాలకే పరిమితమయ్యారు. మధ్యలో సర్వేలంటూ ముందుకు వచ్చినా ఆ ఫలితాలు కూడా విఫలమవ్వడంతో ఇప్పుడు అన్ని రకాలుగా దూరంగా ఉంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో సర్వేలు చేస్తూ కాలం వెళ్లబుచ్చారు. అయితే సర్వేలు కూడా బూమ్రాంగ్ కావడంతో ఇకపై సర్వేలు చేయనని కూడా లగడపాటి శపథం పూనారు. ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలిసి రాజకీయాలపై చర్చించారు. 2019లోనే ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తారనుకున్నారు. కానీ అప్పుడు మరోసారి విజయవాడ ఎంపీ టిక్కెట్ కేశినేని నానికి ఇచ్చారు. కానీ కేశినేని నానికి, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానిక మధ్య పొసగడం లేదు. కేశినేని నాని లోకేష్ పాదయాత్రలో పాల్గొనకుండా దూరంగా ఉన్నారు. ఆయనను తప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. ఆయన స్థానంలో నాని సోదరుడు కేశినేని చిన్నికి పార్లమెంటు స్థానం ఇస్తారని అనుకుంటున్నారు. లగడపాటి తొలుత విజయవాడ నుంచి పోటీ చేయాలనుకున్నా అక్కడ కుదరదని తెలుగుదేశం పార్టీ హైకమాండ్ చెప్పినట్లు తెలిసింది. అక
అడుగు పెట్టాలని…
దీంతో లగడపాటిని గుంటూరు పార్లమెంటుకు షిఫ్ట్ చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఇప్పుడు లగడపాటికి తెలుగుదేశం పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. గల్లా జయదేవ్ స్థానంలో లగడపాటికి ఛాన్స్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. గల్లా జయదేవ్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. లోకేష్ పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు. మరోసారి గుంటూరు నుంచి పోటీకి అనాసక్తి చూపుతున్నారు. దీంతో లగడపాటికి ఫోన్ వెళ్లిందంటున్నారు. ఆయన కూడా పోటీకి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. గుంటూరు పార్లమెంటు టీడీపీకి అనుకూలంగా ఉండటంతో టీడీపీ నుంచి పోటీ చేయడానికి రాజగోపాల్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన సన్నిహితులకు కూడా కొంత సమాచారం అందినట్లు చెబుతున్నారు. మొత్తం మీద లగడపాటి రీ ఎంట్రీ దాదాపుగా ఖాయమైందని తెలుస్తోంది. (Gnt)