(Crime)
కర్ణాటకలో ఓ సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని దారుణంగా హత్యచేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య కెవలం 15 నిమిషాల్లో జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఈ హంతకుడు కుటుంబానికి పరిచయస్తుడే అని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన స్థానికంగా కలవర పెడుతుంది. ఈ ఘటన కర్ణాటక ఉడిపి అనే జిల్లాలో చోటుచేసుకుంది. హంతకుడి కోసం ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి పోలీసులు అతని కోసం గాలించారు. ఒకే కుటుంబానికి సంభందించిన వారిని పక్కాప్లాన్ తోనే చంపి నిందితుడు బెంగళూరుకు జంప్ అయ్యాడు అని సమాచరం.
అందమైన బీచ్లు, దేవస్థానాలతో ప్రశాంతంగా ఉండే ఉడిపి నగరంలో ఈ ఘోరం చోటుచేసుకుంది, ఆదివారం ఉదయం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఇక వివరాలోకి వెళ్లితే ఇంటి యజమాని నూర్ మహమ్మద్ దుబాయ్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని భార్య హసీనా కూతుళ్లు అఫ్నాన్, ఆజ్నాన్, కొడుకు అసీమ్ ఉడిపిలో తృప్తినగర్ లో నివాసం ఉంటున్నారు.
ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచరం…….
డ్రైవర్ ఇచ్చిన క్లూ తో దర్యప్తు చేప్పాటారు పోలిసులు. అయితే హంతకుడు మాత్రం తెలివిగా తప్పించుకున్నాడు. ఆ హంతకుడు మూతికి మాస్క్ ధరించివున్నాడు అని ఆటో డ్రైవర్ తెలిపాడు. 45 ఏళ్ల మధ్య వయస్సు ఉంటాడు అన్ని డ్రైవర్ తెలిపాడు. అయితే ఈ హత్యలు ఒకే వ్యక్తి చేయాడం అచర్యాని కలిగిస్తుంది. పెద్ద కొడుకు అసాద్ బెంగళూరులో ఇండిగో ఎయిర్లైన్స్లో, అలాగే అఫ్నాన్ ఎయిర్హోస్టెస్గా ఉద్యోగం చేస్తున్నారు. పండుగ సెలవులు రావడంతో అసాద్, అఫ్నాన్ రెండు రోజుల కిందట ఉడిపిలోని ఇంటికి వచ్చారు.
వెంటాడి వెటాడి పొడిచి చంపి…….
ఆ హంతకుడు తన వెంట తెచ్చుకున్నా కత్తితో ఇంటిలోకి చొరబడి నలుగురిని వెంటాడి పొడిచి మారణహోమం సృష్టించాడు. ఎక్కడ ఉన్నవారిని అక్కడే పొడిచి, గొంతుకోసి హతమార్చాడు. వంట గది, బెడ్రూమ్, బాతురూమ్,హాల్లో ఒక్కొక్కరి శవాలు ఉండడమే దీనికి నిదర్శనం. హసీనా అత్తను వెంటాడగా ఆమె భయంతో బాతురూంలోకి వెళ్లి లాక్ చేసుకోవడంతో బతికి పోయింది. అసీమ్ సైకిల్ తొక్కుతూ ఇంటిలోకి వచ్చి దుండగున్ని చూసి కేకలు వేశాడు. దుండగుడు బాలున్ని హాల్లో పొడిచి చంపి పరారయ్యాడు.
15 నిమిషాలో పని పుర్తి……. (Crime)
హంతకుడు కెవలం 15నిమిషాల్లో పని ముగించుకొని మళ్లీ ఎవరో బైకులో వెళ్తుంటే సంతెకట్టకు డ్రాప్ చేయమని అడిగాడు. అలా సంతెకట్ట నుంచి ఎక్కడకు వెళ్లాడో జాడ లేదు. ఈ హత్యలు క్షణాల్లోనే ఉడిపి అంతటా పాకిపోయింది. వందలాదిగా అక్కడికి జనం చేరుకున్నారు. పోలీసులు వచ్చి జాగిలాలు, వేలిముద్రలు ఇతర ఆధారాల కోసం గాలించారు. అయితే హంతకుడు బెంగళూరు యాసలో మాట్లాడాడు అని తెలుసుకున్నారు. ఐదుపోలీసు బృందాలు మంగళూరు, శివమొగ్గ, కారవారకు వెళ్లాయి రెండు బృందాలు ఉడుపిలో గాలిస్తున్నాయి. 45ఏళ్ల వయసున్న హంతకుని సీసీ కెమెరా ఫొటోలు, వీడియోలను విడుదల చేశారు. ఎయిర్ హోస్టెస్గా పని చేస్తున్న యువతిపై ద్వేషంతోనే ఈ హత్యాకాండకు పాల్పడి ఉండొచ్చని, లేదా పెద్ద కొడుకు పాత్ర ఎమైన ఉందా అని పలు అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యే తదితరులు ఘటనాస్థలిని పరిశీలించారు. దుబైలో ఉన్న మొహమ్మద్, బెంగళూరులో పెద్దకొడుకు అసాద్ చేరుకోగా సోమవారం సాయంత్రం కోడిబెంగ్రె జామియా మసీదులో అంత్యక్రియలను జరిపారు.