మొహర్రం ఊరేగింపులో అపశ్రుతి చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. శనివారం మొహర్రం ఊరేగింపును ఝార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో నగరంలో నిర్వహిస్తున్నారు. పెద్దయెత్తున భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. అయితే విద్యుత్తు షాక్ తగిలి నలుగురు అక్కడికక్కడే మరణించారు.
గాయపడిన వారిని…
మరో పదమూడు మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే పోలీసులు బొకారో థర్మల్ డీవీసీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో గుజరాత్ లోని జామ్ నగర్ లో తజియా ఊరేగింపులో విద్యుత్తు షాక్ తగిలి ఇద్దరు మరణించగా, పదిహేను మంది గాయాలపాలయ్యారు. దీంతో ఆ యా ప్రాంతాల్లో విషాదం అలుముకుంది.