రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ జోనల్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు పార్టీ అధ్యక్షురాలు పురంద్రీశ్వరి హాజరు కానున్నారు. రేపు రాయలసీమ జోన్ సమావేశం ప్రొద్దుటూరులో జరుగుతుందని పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన తర్వాత పురంద్రీశ్వరి తొలిసారి రాయలసీమలో పర్యటించనున్నారు.
జోనల్ సమావేశాల్లో….
అలాగే ఈ నెల 25వ తేదీన కోస్తా జోనల్ సమావేశం గుంటూరులోనూ, 26వ తేదీన గోదావరి జోన్ సమావేశం రాజమండ్రిలోనూ జరగనున్నాయి. 27వ తేదీన ఉత్తరాంధ్ర జోన్ సమావేశం విశాఖలో జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ చేపట్టాల్సిన కార్యాచరణను ప్రకటించున్నారు. ఇందుకోసం పార్టీకి సంబంధించిన ముఖ్యనేతలు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.