GAZA స్ట్రిప్ లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ఐదో రోజుకు చేరింది. గాజా స్ట్రిప్ లో ఉన్న హమాస్ ఉగ్రమూకలను నిర్మూలించే దిశగా ఇజ్రాయెల్ దూకుడు పెంచింది. హమాస్ నరమేధానికి ప్రతీ కారంగా ఆ ఉగ్ర సంస్థనే మట్టుపెట్టాలన్న పట్టుదలతో ఇజ్రాయెల్ దళాలు ముందుకు కదులుతున్నాయి. ఉగ్ర సంస్థల స్థావరంలో కీలకమైన అల్ ఫుర్కాన్ పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. హమాస్ ఉగ్ర సంస్థ అగ్ర నాయకత్వాన్నినిర్మూలించే పనిలో ఇజ్రాయెల్ ఆర్మీ దళాలు రాకెట్ల వర్షం కురిపిస్తున్నాయి. అగ్ర నేతల నివాసాలను టార్గెట్ చేసుకుని వాటిని పేల్చే వేస్తుండటంతో హమాస్ కొత్త ఎత్తుగడకు తెర తీసింది. ప్రతీ దాడికి ముందు ఒక బందీని ముందుకు తీసుకొచ్చి వారిని చంపేస్తామని బెదిరిస్తోంది. దీంతో ఇజ్రాయెల్ దళాలు ముందస్తు సమాచారం లేకుండా హమాస్ నేతలపై దాడులు కొనసాగిస్తున్నాయి.
బందీల కోసం ఇజ్రాయెల్ ఆందోళన
ఇప్పటికే హమాస్ చెరలో 100 మంది చిన్న పిల్లలు, మహిళలు బందీలుగా ఉండటంతో ఇజ్రాయెల్ ఆందోళన పడుతోంది. ఉగ్రమూకలపై విరుచుకుపడి దాడులు పెంచాలని ఇజ్రాయెల్ అతివాదులు డిమాండ్ చేస్తుండగా, హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారి మనుగడ కోసం నేతన్యాహు ప్రభుత్వం తపిస్తోంది. గట్టి దాడే జరిగితేఅమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తాయి. దాంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం గందరగోళంలో పడిపోయింది. ఇజ్రాయెల్ కు మానవత్వం విషయంలో కాస్త పాజిటివ్ థింకింగ్ ఎక్కువే. ఎందుకంటే గతంలో 2006లో హమాస్ చెరలో బందీ అయిన ఒక ఇజ్రాయెల్ సైనికుని విడిపించుకోడానికి వెయ్యిమందికి పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ వదిలేసింది.ఈ ఖైదీల్లో చాలామంది కి తీవ్రమైన నేర చరిత్ర, ఉగ్ర వాద బ్యాక్ గ్రౌండ్ఉంది. అయినా తమ దేశ సైనికుడి ప్రాణాలే తమకు ముఖ్యమని ఇజ్రాయెల్ అప్పట్లో ఉదారంగా వ్యవహరించింది. ఒక్క సైనికుడి విషయంలోనే అంత ఆలోచించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఏకంగా వంద మందకి పైగానే ఇజ్రాయెల్ సివిలియన్లు హమాస్ చెరలో ఉండటంతో ఏం చేయాలో తెలీని అయోమయంలో పడిపోయింది. ఇజ్రాయెల్ దగ్గరున్న 4,500మంది పాలస్తీనా ఖైదీలను వదిలితేనే ఈ వంద మందిని విడిచిపెడతామని హమాస్ కండిషన్లు పెడుతోంది.
నేతన్యాహుపై ప్రతిపక్షాల ఒత్తిడి
కానీ నిజానికి జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీలను వదిలితే ఉగ్ర కార్యకలాపాలను నియంత్రంచడం దాదాపు అసాధ్యం. అందుకే ఇజ్రాయెల్ హమాస్ ఉచ్చులో పడకుండా దూకుడు పెంచాలని ఇజ్రాయెల్ కేబినెట్ లో కొందరు సలహాలిస్తున్నారు. వందమంది క్షేమం కన్నా.. హమాస్ ఉగ్రమూకలను మట్టు పెట్టడమే తక్షణ కర్తవ్యం కావాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని ప్రతి పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కీలకమైన ఈ విషయంలో ఇజ్రాయెల్ బందీలు చనిపోతే నేతన్యాహు ప్రభుత్వం రాజకీయంగా విమర్శలపాలు కాక తప్పదు. అందుకని ఎటువైపు అడుగేయాలన్నది అర్ధం కాటం లేదు.
అసలు బందీలు ఎక్కడున్నారు? GAZA
మరోవైపు అసలు హమాస్ చెబుతున్న బందీలు ఎక్కడున్నారో, వారు సజీవంగా ఉన్నారో లేదో కూడా తెలీటం లేదు. గాజా లో జనావాసాలు చాలా దట్టంగా ఉంటాయి. కాబట్టి బందీలను ఎక్కడ దాచారన్నది కనిపెట్టలేకపోతున్నారు. ఏదేమైనా బందీలు బతికి ఉంటేనే హమాస్ తన డిమాండ్లు నెరవేర్చుకోవచ్చు. మరి వారిని ఎక్కడ దాచారో, వారు ఎలా ఉన్నారో తెలీటం లేదు. ఉగ్రమూకల రహస్య స్థావరాలు, నేలమాళిగల గుట్టు కనుక్కోవడం కష్టమే… ఈ నేల మాళిగలను బాల కార్మికులతో నిర్మించారు. పైకి కొంచెం కూడా వాటి ఆనవాళ్లు కనిపించవు. శాటిలైట్ ఛాయా చిత్రాలకు, యుద్ధ విమానాలకు కూడా వీటి గుట్టు తెలియదు.. వాటి రాడార్ పరిధిలోకి ఇవి కనపడవు.. అందువల్ల ఆకాశమార్గంలో దాడులు చేయడం కష్టం… దీనివల్ల అమాయక పౌరులు కూడా బలైపోతారు. ఈ నేలమాళిల గుట్టు కనిపెట్టాలంటే ఇజ్రాయెల్ సైన్యం ఇంటింటికీ వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా రిస్కుతో కూడుకున్న పని. ఎందుకంటే ఆప్రాంతం మొత్తం హమాస్ చేతుల్లో ఉండటం వల్ల ఇజ్రాయెల్ దళాలు అక్కడ కాలుపెడితే చీమల పుట్టపై కాలుపెట్టినట్లే అవుతుంది.