Crime
చిన్నారుల రక్షణ కోసం ఎన్నిచట్టాలొచ్చినా.. వారిపై దౌర్జన్యాలు, హత్యలు ఆగడం లేదు. అభం శుభం తెలియని ఐదేళ్ల పసిదానిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ దుర్మార్గుడు.. అంతేకాదు.. ఆ తర్వాత ఆ పసిదాన్ని గొంతు నులిమి చంపేసి చెత్త కుప్పలో పడేశాడు.. మానవత్వం మంటగలిసిపోయిన ఈ దారుణ ఘటన కేరళలోని అలువాలో ఈ ఏడాది జులైలో జరిగింది. కేసులో నేరం రుజువవడంతో కేరళ కోర్టు నిందితుడికి మరణ శిక్ష విధించింది. కేరళ హైకోర్టు తీర్పును నిర్ధారించిన తర్వాత మరణశిక్షను అమలు చేస్తారు…
గోనె సంచిలో శవం… Crime
కేరళలోని కొచ్చి జిల్లాలోఈ అమానుషం జరిగింది. ఓ వ్యక్తి జ్యూస్ కొనిస్తానని ఆశ చూపి ఐదేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యచారం చేశాడు. అనంతరం గొంతు నులిమి ఆ పాపను కడతేర్చాడు. చిన్నారి మృతదేహన్ని గోనె సంచిలో వేసి చెత్తకుప్పల్లో పడేశాడు. శుక్రవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించలేదు. దీంతో స్థానికంగా వెతికిన కుటుంబసభ్యులు చివరకు పోలిసులను ఆశ్రయించారు. గాలింపు చర్యలు మొదలు పెట్టిన పోలీసులు చెత్త డంపింగ్ యార్డులో పడేసి ఉన్న గోనె సంచిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోస్టుమార్టం కోసం డెడ్ బాడీని ఆస్పత్రికి తరలించారు.
అదే భవనం లో నిందితుడు నివాసం…
ఇంతటి దారుణానికి తెగబడిన కామాంధుడు బాలిక ఉన్న భవనంలోనే అద్దెకు నివసించేవాడని పోలీసు దర్యాప్తులో తేలింది. బాగా మద్యం తాగిన తర్వాత అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని వెల్లడైంది. ఆ బిల్డింగ్ లో ఉన్న సీసీ టీవీ పరిశీలించిన పోలీసులు ఆ వ్యక్తి పేరు అష్వాఖ్ ఆలమ్ అని బీహర్ కు చెందిన అతడు కూలీ పనుల కోసం కెరళకు వలస వచ్చాడని గుర్తించారు.
సీసీ టీవీ పుటేజ్ సహయంతో……..
అతడు పాపను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. దీంతో శనివారం రాత్రి 9:30 గంటలకు పోలీసులు నిందితుడిని అదుపులోని తీసుకున్నారు. ఆ సమయంలో అతడు స్పృహలో లేడు. బాగా తాగి ఉన్నందున పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. అతడు స్పృహలోకి వచ్చాక ఇన్వెస్టిగేట్ చేస్తే జరిగిందంతా చెప్పాడు. ఆదివారం ఉదయం నేరం అంగీకరించాడు. అయితే బాధిత బాలిక కుటుంబం కూడా బీహార్ నుంచే వలస వచ్చి కేరళలో నివసిస్తున్నారు.
కేరళ పోలీసుల క్షమాపణ
నిందితుడిని కోర్టులో హాజరుపర్చి రిమాండుకు తరలించిన పోలీసులు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో బాలికకు క్షమాపణలు చెప్పారు పోలిసులు. సారీ డాటర్ నిన్ను నీ తల్లిదండ్రులకు ప్రాణాలతో అప్పగించడంలో మేం విఫలమయ్యాం అని ఆ ట్వీట్ లో పేర్కన్నారు. మలయాళంలో చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురి మరణవార్త తెలిసినప్పటి నుంచి అ చిన్నారి పేరెంట్స్ గుండెలు పగిలెలా రోదిస్తున్నారు.
నెలలోపే విచారణ పూర్తి Crime
ప్రత్యేక కోర్టులో నెల రోజుల్లోపే ఈ చార్జిషీట్ దాఖలు చేశారు. కేసు విచారణను న్యాయమూర్తి కే సోమన్ అక్టోబర్ 4వ తేదీన ప్రారంభించారు. 26 రోజుల్లో విచారణ ముగించారు. నవంబర్ 4వ తేదీన అష్వాఖ్ ఆలమ్ ను దోషిగా నిర్ధారించారు. నవంబర్ 14న అతడికి మరణ శిక్ష విధించారు. చిన్నారిపై హత్యాచారం కేసులో అష్వాఖ్ ఆలమ్ కు శిక్ష విధించిన నవంబర్ 14వ తేదీ చిన్నారుల దినోత్సవం కావడం విశేషం. అలాగే, 11 సంవత్సరాల క్రితం 2012లో, ఇదే నవంబర్ 14, న లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన పొక్సొ చట్టం అమల్లోకి వచ్చింది.