Gold
బంగారం ధరలు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయి. మార్కెట్ లో కొత్త డిజైన్లు కనపడటం వెంటనే కొనుగోలు చేయడానికి మహిళలు ఉత్సాహం చూపుతుంటారు. పైగా పెళ్లిళ్ల సీజన్ జ్యుయలరీ దుకాణాలన్నీ కస్టమర్లతో కళకళలాడిపోతున్నాయి. ప్రతి ఇంట్లో శుభకార్యానికి బంగారం, వెండిని ఉపయోగించడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే దక్షిణ భారత దేశంలో ఉన్నన్ని జ్యుయలరీ దుకాణాలు మరెక్కడా కనిపించవు. దక్షిణ భారతీయులు పసిడికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు. బంగారం కొనుగోలు చేసి దానిని దాచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారు. బంగారం ఉంటే అదొక ధైర్యం. కష్టకాలంలో ఆదుకుంటుందన్న నమ్మకం.అందుకే బంగారం కొనుగోళ్లకు మద్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు.
దక్షిణ భారతంలోనే…
అందుకే బంగారానికి అంత డిమాండ్ ఏర్పడింది. ఉత్తర భారత దేశంలోనూ బంగారం కొనుగోళ్లు ఎక్కువగా కనపడుతున్నా దక్షిణ భారతదేశంతో పోలిస్తేే తక్కువేనని చెప్పాలి. ఇక్కడ ప్రతి వీధిలో బంగారం దుకాణాలు ఇబ్బడి ముబ్బడిగా వెలిశాయి. కార్పొరేట్ సంస్థల నుంచి సామాన్య దుకాణాల వరకూ బంగారాన్ని విక్రయిస్తూ లాభాల బాటన నడుస్తున్నాయి. బంగారం Gold ధర తగ్గినా, పెరిగినా అది వ్యాపారులకు లాభమేనంటున్నారు. అందుకే వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ తమ షాపులకు క్యూ కట్టేలా చేస్తున్నారు.
భవిష్యత్ లో…
బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదొడుకుల బట్టి ప్రభావం చూపుతాయి. దీంతో పాటు ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి విలువ, రష్యా – ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం, కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులను తగ్గించడం, డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మధ్యలో కాస్త నెమ్మదించినా ఈ ఏడాది చివరి నాటికి తులం బంగారం ధర అరవై వేలకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవసరమున్న ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. పెట్టుబడిగా కూడా బంగారంపై పెడితే మంచిదన్న సూచనలు వెలువడుతుండటంతో పసిడికి మరింత గిరాకీ ఏర్పడింది.
ధరలు ఈరోజు… Gold
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతుండటం మహిళలకు ఊరట కల్గించే అంశం. బంగారం ధర ఈరోజుపెరిగినా పెద్దగా పెరగక పోవడంతో కొనుగోలు చేయవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,450 రూాపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,400 రూపాయలకు చేరుకుంది. వెండి ధర కూడా స్వల్పంగా పెరిగి ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి ధర 76,050 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముందన్న హెచ్చరికలతో ఇప్పుడే కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి. శ్రావణమాసం కూడా కావడంతో డిమాండ్ మరింత పెరిగి ధరలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.