అనుకున్నట్లే జరుగుతుంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత పసిడి Gold ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. శ్రావణ మాసం కావడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగానూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఈరోజు స్వల్పంగా పెరగడంతో బంగారం ప్రియులకు కొంత షాక్ కల్గించే అంశంగానే చూడాలి. బంగారం ఎప్పుడూ అంతే ధరలు తగ్గుతున్నాయని సంతోషించే లోపు పెరగడం మామూలే. శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతుండటంతో బంగారం ధరలు మరింత ప్రియం అయ్యే అవకాశాలున్నాయి. అందుకే త్వరపడి కొనుగోలు చేయడం మంచిదన్న సూచనలు వినిపిస్తున్నాయి.
అనేక కారణాలు…
బంగారం ధరలు ఎప్పుడూ స్థిరంగా కొనసాగవు. ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. శ్రావణ మాసం సమీపిస్తున్నా ధరలు పెద్దగా పెరగకపోవడంతో కొనుగోలు దారులు ఒకింత సంబరపడుతున్నారు. అయితే బంగారం ధరలు పెరిగితే అమాంతం పెరుగుతాయన్న విషయాన్ని మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బంగారంపై సుంకం పెంచడం కూడా ధరలు పెరగడానికి ఒక కారణమని చెబుతున్నారు. దీంతో పాటు అనేక కారణాలున్నాయి. ద్రవ్యోల్బణమూ ప్రధాన కారణమే. డాలర్ తో రూపాయి మారకం విలువ వల్ల కూడా పసిడి ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. ఎంతగా అంటే ఈ ఏడాదికి 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై వేలుకు చేరుకుంటుందంటున్నారు.
శ్రావణ మాసంలో… Gold
సాధారణంగా శ్రావణమాసంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ మాసంలో బంగారానికి అధిక డిమాండ్ ఉంటుంది. కనీసం గ్రాము బంగారమైనా కొనుగోలు చేయాలని ప్రతి మహిళ భావిస్తుంది. అందుకే బంగారం దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. ఇక మరో రెండు మాసాలు పసిడి కొనుగోళ్లు ఎక్కువగానే ఉంటాయి. ధరలు పెరిగే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకోవడం మంచిదన్న సూచనలు వినపడుతున్నాయి. పసిడి అంటేనే పడి చచ్చి పోయే మగువలకు ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదే అదను అని జ్యుయలరీ దుకాణాల యాజమాన్యాలుకూడా ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.
స్వల్పంగా పెరిగిన…
బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. అది పెద్ద పెరుగుదల కాదు. పది గ్రాముల బంగారం ధరపై కేవలం యాభై రూపాయలు మాత్రమే పెరిగింది. యాభై రూపాయలు పెరగడం అంటే మామూలు విషయమే. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం Gold, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం మార్కెట్ లో 54,150 రూపాయలుగా నమోదయి ఉంది.24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,070 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక కిలో వెండి ధర మాత్రం హైదరాబాద్ మార్కెట్ లో ప్రస్తుతం 73,300 రూపాయలు పలుకుతుంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశముందని నిపుణులు సూచిస్తుండటంతో కొనుగోలు దారులు ఇక జ్యుయలరీ దుకాణాలకు క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తుంది.