బంగారం ధరలు తగ్గితే అంతకంటే ఆనందం ఇకేముంటుంది? అలాగే స్థిరంగా కొనసాగినా పసిడిప్రియులకు పండగ వంటింది. బంగారం కొనుగోళ్లపై మక్కువ చూపే మగువలు నిత్యం గోల్డ్ రేట్స్ ను పరిశీలిస్తుంటారు. ఎప్పుడు తగ్గినా వెంటనే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు. ఇక పెళ్లిళ్ల సీజన్ అయితే చెప్పాల్సిన పనిలేదు. కొందరు ఆభరణాలను కొనుగోలు చే్స్తుంటే.. మరికొందరు పెట్టుబడిగా చూస్తూ పసిడిని సొంతం చేసుకోవాలని పరితపిస్తారు.
కారణాలివీ…
అందుకే దేశంలో బంగారం ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డాలర్ తో రూపాయి తగ్గుదల వంటి కారణాలతో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. తమ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బంగారం ఉపయోగపడుతుంది. అందుకే బంగారాన్ని ఎగబడి కొనుగోలు చేసే వారు ఎక్కువ. పుత్తడి అంటే పడి చచ్చే వాళ్లు దక్షిణ భారత దేశంలోనే ఎక్కువగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లో గోల్డ్ బాండ్లు కొనుగోలు చేయడం అలవాటు. కానీ మన దేశంలో మాత్రం బంగారు ఆభరణాలను మాత్రమే కొనుగోలు చేయడం హ్యబీగా పెట్టుకున్నారు. ఈ కారణం వల్లనే బంగారం దుకాణాలు రోజుతోనూ, సీజన్ తోనూ సంబంధం లేకుండా కిటకిటలాడిపోతుంటాయి.
నేడు ధరలు ఇలా…
దేశంలో ఈరోజు బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బంగారం, వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం హైదరబాద్ బులియన్ మార్కెట్ 54,550 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,510 రూపాయలుగా కొనసాగుతుంది. విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం విజయవాడలో 54,550 రూపాయలు, విశాఖ పట్టనంలో 54,550 రూపాయలుగా నమోదయిం ఉంది. వెండి ధరలు కూడా పెరగపోవడం ఒకింత సంతోషకరమే. కిలో వెండి ధర 76,700 రూపాయలుగా ఉంది.