బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతాయో చెప్పలేం. గతంలో బంగారం ఒక ఖరీదైన వస్తువు. కొన్ని వర్గాలకే పరిమితమైన ఆభరణం. అలాంటిది ఇప్పుడు ధరలు పెరిగినా బంగారం కొనుగోలుకు సులభ వాయిదా పద్ధతులు వచ్చేశాయి. ఈఎంఐల ద్వారా కొనుగోలు చేసే వీలుంది. బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఒకప్పుడు పెళ్లిళ్లు, ఇళ్లలో శుభకార్యాల సమయంలోనే ముందుకు వచ్చే వారు. కానీ ఇప్పుడు వాటితో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కొనుగోలు చేస్తున్నారు.
కొత్త డిజైన్లు…
మార్కెట్ లోకి కొత్త డిజైన్లు వచ్చాయని తెలిస్తే చాలు ధరలతో సంబంధం లేకుండా తమ వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతోనైనా, వాయిదా పద్ధతుల్లోనైనా కొనుగోలు చేయడం ప్రారంభమయింది. ముఖ్యంగా మహిళలు కొత్త కొత్త డిజైన్లతో కూడిన ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు. అవసరమైతే పాత బంగారాన్ని మార్చి మార్కెట్ లోకి లేటెస్ట్ గా వచ్చిన డిజైన్లను తమ సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే బంగారం దుకాణాలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి.
నిలకడగా…
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 54,450 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 59,410 రూపాయలుగా నమోదయింది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్ లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. వెండి ధర కూడా నిలకడగానే ఉంది. కిలో వెండి ధర ఈరోజు మార్కెట్ లో 73,400 రూపాయలుగా ఉంది.