రోజూ పసుపు పాలు (Golden Milk) తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని మన పెద్దల చెప్పడం మన ఎప్పుడు వింటూనే ఉంటాము. పసుపు కు మన వంటింటి దగ్గర నుంచి ఆయుర్వేదం వరకు గొప్ప స్థానం ఉంది. పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. సహజ యాంటీబయాటిక్గా పరిగణించబడుతుంది కూడా. పాలలో కాల్షియం మరియు ప్రోటీన్తో సహా అనేక విటమిన్లు ఉంటాయి.చిన్నపిల్లలా దగ్గర ఉంచి పెద్దవారి వరకు పాలు తాగడం తప్పనిసరి అని చాలా ఏళ్లుగా వైద్యులు చెబుతున్నారు. పసుపులోని ఔషధ గుణాలు మరియు పాలలోని ఆరోగ్య ప్రయోజనాలను కలిపి తీసుకోవడం వల్ల రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని సాధారణంగా చెబుతారు.
పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నమ్ముతారు. కానీ ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తితో పెరగడమే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయట. ఈ విషయం తెలిసి నేటి నుంచి రాత్రిపూట పసుపు పాలు తాగడం ప్రారంభిస్తారు. పసుపు పాలను బంగారు పాలు(Golden Milk) అని ఆయుర్వేద వైద్యులు పేర్కొన్నారు. పసుపుతో పాలతో రోగనిరోధక శక్తికి మాత్రమే కాకుండా, ఇతర ప్రయోజనాలు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం..
నిద్రలేమి :
కొందరు వ్యక్తులు రాత్రి నిద్రించడానికి ఇబ్బందిగా ఉన్నవారికి పసుపు పాలు తాగమని సిఫార్సు చేస్తారు. ప్రశాంతంగా నిద్రపోవాలనుకునే వారు, ప్రతిరోజూ సాయంత్రం ఒక గ్లాసు పసుపు పాలు (Golden Milk) తాగాలట. ఇది బాగా నిద్రపోవడానికి సహాయపడుతుందట.
రోగ నిరోధక శక్తి :
పసుపు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుందని అంటారు. సాయంత్రం పూట పసుపు పాలు తాగడం వల్ల దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు కూడా రాకుండా ఉంటాయట. సీజన్తో సంబంధం లేకుండా పసుపు పాలను తీసుకోవడం మంచిదంటున్నారు .
కీళ్ల నొప్పులు :
పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉనందున కీళ్ల నొప్పులతో బాధపడేవారికి పసుపు పాలు (Golden Milk) ఒక గొప్ప ఔషధం అని చెప్పవచ్చు . ఈ పసుపు పాలు వొంటి లో ని వాపు ను తీసి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందట. అందువల్ల, పసుపు పాలను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల కీళ్ల మరియు ఎముకల సమస్యల నుండి క్రమంగా ఉపశమనం పొందవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు .
చర్మ సంరక్షణ:
పసుపును వందల ఏళ్లుగా చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. పసుపు చర్మానికి రాసుకుంటే చర్మాన్ని మెరిసేలా చేస్తు హానికరమైన బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుందట . పసుపు పాలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యకరమైన మరియు మెరిసే చర్మం సొంతమవుతుందట.
పసుపుతో పాలను ఎలా తాగాలి..?
1. సాధారణంగా, రోగనిరోధక శక్తిని పెండానికి దీన్ని తాగాలనుకుంటే, ముందుగా పాలను మరిగించి వారి వారి అభిరుచిని బట్టి చిటికెడు పసుపు, పంచదార లేదా బెల్లం తో కలిపి తీసుకోవచ్చట.
2. పడుకునే ముందు వేడిగా లేదా వెచ్చగా త్రాగాలి.
3. మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు కూడా పాలలో పసుపు, చిటికెడు జాజికాయ పొడి కలిపి తాగవచ్చుట.
4. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు పసుపు పాలు తయారుచేసేటప్పుడు కొన్ని జీడిపప్పులను కూడా కలిపి తీసుకుంటే ఎంతోశక్తినిస్తుందట. జీడీ పాపులు పాలలో తినడం ఇష్టం లేని వారు జీడిపప్పులు పొడి లా చేసుకుని పాలు మరుగుతున్నప్పుడు పొడి జీడిపప్పును కలిపి తాగవచ్చట.
5. పసుపు పాలలో చిటికెడు ఎండుమిరియాల పొడి వేసి మరిగించి తాగితే గొంతు కు సంభందించిన ఎలాంటి నొప్పి, ఇన్ఫెక్షన్లు అయినా ఇట్టే తగ్గిపోతాయట.