ఆంధ్రప్రదేశ్ లో విదేశీ అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం నేడు నిధులను విడుదల చేయనుంది. ఉదయం పదకొండు గంటలకు జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అర్హులైన 357 మంది విద్యార్థుల ఖాతాల్లో నగదును జమ చేయనున్నారు. మొత్తం 45.53 కోట్ల రూపాయల నిధులను జగన్ వారి అకౌంట్లలో ఈరోజు ఉదయం పదకొండు గంటలకు తాడేపల్లి కార్యాలయం నుంచి బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
అర్హతలు ఇవే…
విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ఈ పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకూ ఈ పథకం 65.48 కోట్ల రూపాయలను విడుదల చేసింది. యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ప్రకారం టాప్ 50 ర్యాంకులున్న కళాశాలల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఈ పథకాన్ని జగన్ అందించనున్నారు. యూనివర్సిటీని బట్టి ఒక్కొక్కరికి 1.25 కోట్ల రూపాయల వరకూ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం కింద నిధులను విడుదుల చేయనుంది. ఏడాదికి ఎనిమిది లక్షల ఆదాయం ఉన్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు.