GUN
మొన్నామధ్య విశాఖలో ఓ ఎంపీ కుమారుడిని బెదిరించి గృహ నిర్బంధం చేసి డబ్బుకోసం చిత్రహింసలు పెట్టిన గ్యాంగ్ ని చూశాం… తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు లో సెటిల్ మెంట్ కోసం ఓ సుపారీ గ్యాంగ్ తుపాకులతో హల్ చల్ చేయడం పెరుగుతున్న నేర సంస్కృతికి అద్దం పడుతోంది. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర నిందితులు 50 లక్షలు అప్పు తీసుకుని ఆ అప్పు తిరిగి చెల్లించమనడంతో చంపేందుకు ప్రయత్నించారు. సెటిల్మెంట్ చేసుకుందాం రమ్మంటూ ఏలూరులోని విజయ విహార సెంటర్ లో ఉన్న ఎన్ స్క్వేర్ హోటల్ కి పిలిచి నిర్బంధించి నానా చిత్ర హింసలకు గురి చేసారు. ఆ దృశ్యాలన్ని వీడియో కాల్ లో మరొక అజ్ఞాత వ్యక్తి కి చూపించారు. అక్కడనుంచి ఒక కార్ లోబాధితుడిని కిడ్నాప్ చేసి, పిస్టళ్లతో బెదిరించి భయభ్రాంతులకు గురిచేసారు. మొత్తం ఎపిసోడ్ అంతా క్రైమ్ థ్రిల్లర్ ను తలపించే రీతిలోసాగడంతో ఏలూరు నగరంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
రియల్ వ్యాపారికి మాయమాటలు చెప్పి …
గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడక గ్రామానికి చెందిన అన్నే కాంతారావు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. అతను వ్యాపారం లో నష్టపోయాడు. ఈ విషయం అతని స్నేహితుడైన తాడేపల్లి గూడెం కు చెందిన లీలా కృష్ణ కు తెలిపాడు. లీలా కృష్ణకు తెలిసిన సతీష్ రాజు అనే వ్యక్తి కి దుబాయ్ లో ఒక బ్యాంకులో 1000 కోట్లు ఉన్నాయని ఆ డబ్బులు దుబాయ్ బాంక్ నుండి రావాలంటే సతీష్ రాజు ఎకౌంట్ కి 20 లక్షలు వేయాలి అని అడిగాడు. అయితే సతీష్ రాజు నాకు రెండు కోట్లు ఇస్తాడు వాటిలో నీకు కొంత ఇస్తానని లీలా కృష్ణ కాంతారావు తో నమ్మబలికాడు. అంతా నోటి మాట పైనే.. ఇవన్నీ మాయమాటలు అని తెలియక కాంతారావు తన ఎకౌంట్ నుండి సతీష్ రాజు ఎకౌంట్ కి 2017 నుండి 2019 మధ్య కాలం లో 50 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంకేముంది అప్పటి నుండి లీలా కృష్ణ. సతీష్ రాజు గాయబ్.. ఇద్దరూ కనబడక పోవడం తో ఆరా తీయగా హైదరాబాద్ లో కాకతీయ హిల్స్ లో హౌస్ నంబర్ 257లో ఉంటున్న ట్టు తెలుసుకున్నాడు కాంతారావు. ఇచ్చిన 50 లక్షలు ఇవ్వమని ఫోన్ చేస్తే సమాధానం కూడా ఇవ్వలేదు.
బెంగళూరు వెళ్లినా ఫలితం శూన్యం
ఇదిలా ఉండగా దుబాయ్ బ్యాంకు లో 1000 కోట్లు డబ్బు ఉన్నట్టు గా చెప్పిన సతీష్ రాజు మీద సి బి ఐ కేసులున్నాయని కేసు నంబర్ spl0000641/2018లో A /3 ముద్దాయిగా ఉన్నాడని కాంతారావు కు ఓ క్లూ అందింది. ఆ కేసులో బెంగుళూరు కోర్ట్ లో వాయిదాకు వస్తున్నట్టు తెలుసుకున్న కాంతారావు అక్కడికి వెళ్లాడు. తన డబ్బుని తిరిగి ఇవ్వలి అని బ్రతిమిలాడాడు. దీంతో సతీష్ రాజు స్నేహితుడు సి హెచ్ వినయ్ రెడ్డి కల్పించుకుని కోర్ట్ దగ్గర గొడవ వద్దు రెండు మూడు రోజుల్లో సెటిల్ చేస్తామని చెప్పాడు.సతీష్ రాజు ఐదుకోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టాడని తెలుసుకున్న వినయ్ రెడ్డి ఏలూరు వస్తే అక్కడ అన్నీ మాట్లాడుకోవచ్చని ఫోన్ చేశాడు.
ఎన్ స్క్వేర్ హోటల్ వేదికగా కిడ్నాప్ స్కెచ్ GUN
ఏలూరులో సతీష్ రాజు ఎన్ స్క్వేర్ హోటల్ కి కాంతారావు వెళ్లగా కొద్ది సేపటికి నలుగురు వ్యక్తులు అక్కడకు వచ్చారు. ఆ నలుగురు తెలంగాణా STFపోర్స్ పోలీసులమని నమ్మించారు. మీ పై వారంట్ ఉంది లోకల్ పోలీస్ స్టేషన్ లో చెప్పాం..మాతో బయల్దేరండి అంటూ కాంతారావు చేతికి బేడీలు వేసి కారులోకి ఎక్కించారు. తన వెంట సతీష్ రాజు, వినయ్ రెడ్డి కూడా కారు ఎక్కడంతో కాంతారావు నిజమేనని నమ్మాడు. బైపాస్ లో గుండుగొలను వరకు తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చి జంగారెడ్డి గూడెం వెళ్లే రోడ్డు బైపాస్ కి వచ్చారు.
పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ తో బెదిరింపులు GUN
బైపాస్ బ్రిడ్జి ప్రక్కన గుబురుగా ఉన్న తుమ్మల్లోకి తీసుకెళ్లి ముగ్గురు వ్యక్తులు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గన్ లతో బెదిరించారు. కాంతారావు నుదిటిపై గురి పెట్టి 50 లక్షలు ఎదర ఇమ్మని లేదంటే చంపేస్తామనీ బెదిరించారు. నేలపై రెండు రౌండ్లు కాల్చి భయపెట్టారు. మళ్ళీ అప్పడిగితే ఈ సారి ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించడం తో బాధితుడు ప్రాణ భయం తో అక్కడనుంచి ఎలాగోలా బయటపడ్డాడు. ఆ వెంటనే ఏలూరు టూ టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనతో అప్రమత్త మైన పోలీసులు ఏలూరులో సెటిల్మెంట్ చేసుకుందామని బాధితుడిని రప్పించారు.
హోటల్ సి సి ఫుటేజ్ ని కూడా పోలీసులు సేకరించారు. మొత్తం సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ను తలపించిన ఈ ఎపిసో్డ్ లో నిందితులకోసం పోలీసులు గాలిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నేలపైకి తుపాకీ కాల్పలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించారు. నగరంలో చాప కింద నీరులా పెరుగుతున్న నేర సంస్కృతిపై ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తుంటే,
అసలు గన్ కల్చర్ ఇక్కడికెలా వచ్చిందన్న అంశం పోలీసు అధికారులను నివ్వెర పరచింది. నిందితులకు దుబాయ్, హాంగ్ కాంగ్ లలో కూడా ఆర్ధిక వివాదాలున్నట్లు తెలుస్తోంది. GUN