(NCA)
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం ఇంకా తగ్గలేదనే సమాచారం బయటికి వచ్చింది. అతడు ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ల్లోజ గెలిచి సత్తా చాటింది. అయితే, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయమే భారత్కు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే గాయం వల్ల న్యూజిలాండ్తో. మ్యాచ్ ఆడలేదు. బంగ్లాదేశ్తో మ్యాచ్లోర గాయపడిన హార్దిక్ పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ NCA లో చికిత్స పొందుతున్నాడు. ఈ తరుణంలో హార్దిక్ పాండ్యా విషయంలో తాజాగా ఓ విషయం బయటికి వచ్చింది.
ఎన్సీఏలో చికిత్స పొందుతున్నా హార్ధిక్… (NCA)
పుణెలో అక్టోబర్ 19న బంగ్లాదేశ్తోధ జరిగిన మ్యాచ్లోహ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. కేవలం మూడు బంతులు వేసిన తర్వాత గాయం పాలయ్యాడు. కాలు మడత పడటంతో అతడి చీలమండకు గాయమైంది. ఆ తర్వాత అతడి కాలికి స్కానింగ్ చేశారు వైద్యులు. అనంతరం చికిత్స కోసం ఎన్సీమఏకు పంపారు.
దీంతో, న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్ ఆడలేదు హార్దిక్. ప్రస్తుతం ప్రపంచకప్ గ్రూప్ స్టేజీలో ఆడిన ఐదు మ్యాచ్ల్లోడ ఐదింట్లోనూ టీమిండియా గెలిచింది. ఇంకా భారత్ నాలుగు మ్యాచ్లుడ ఆడాల్సి ఉంది. వీటిలో రెండు గెలిచినా ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా భారత్ సెమీస్ చేరుకుంటుంది. దీంతో రోహిత్ సేన సెమీస్ చేరడం దాదాపు ఖాయమనుకోవచ్చు. దీంతో హార్దిక్ పాండ్యా విషయంలో సెమీస్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పుడే పూర్తిగా కోలుకునేంత వరకు వేచిచూడాలని టీమిండియా మేనేజ్మెం ట్ ఆలోచిస్తోంది. (NCA)
ఇంగ్లండ్ శ్రీలంక మ్యాచ్ లకు దూరం…
ప్రపంచకప్లోర టీమిండియా తదుపరి రెండు మ్యాచ్లబకు కూడా హార్దిక్ పాండ్యా అందుబాటులోకి రాడని తాజాగా తెలుస్తోంది. అక్టోబర్ 29న ఇంగ్లండ్తోల, నవంబర్ 2వ తేదీన శ్రీలంకతో భారత్ మ్యాచ్లుఅ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లోకు కూడా హార్దిక్ దూరమవడం దాదాపు ఖాయమైందనే సమాచారం వెల్లడైంది. ఇంగ్లండ్తోత మ్యాచ్ కోసం టీమిండియాతో హార్దిక్ కలుస్తాడని ఇటీవల అంచనాలు వచ్చాయి.
అయితే టీమిండియా మేనేజ్మెంంట్ మాత్రం తొందరపడకూడదని అనుకుంటోంది. పూర్తిగా కోలుకున్నాకే హార్దిక్నుే బరిలోకి దించాలని భావిస్తోంది. నవంబర్ 5వ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్కు హార్దిక్ తిరిగి టీమిండియాలోకి వస్తాడని తెలుస్తోంది.ఇంగ్లండ్, శ్రీలంకతో మ్యాచ్ల కు హార్దిక్ జట్టులో లేకపోతే సూర్యకుమార్ యాదవ్కేత మళ్లీ తుదిజట్టులో చోటు దక్కనుంది.
ఇంకా ప్రాక్టీస్ మెుదలు పెట్టని పాండ్యా…
గాయపడిన హార్దిక్ పాండ్యా ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టలేదట.ఈ వీకెండ్లో అతడు మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ఎన్సీఏ వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. ముందుగా అతడు పూర్తిగా కోలుకునేందుకే పూర్తిగా ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆ వర్గాలు చెప్పాయి.
హార్దిక్ పాండ్యాకు టీమిండియా వద్ద సరిగ్గా సూటయ్యే ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌంనడర్ బ్యాకప్ లేదు. అందుకే న్యూజిలాండ్తోడ మ్యాచ్కు్ భారత్ రెండు మార్పులు చేసింది. హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్నుచ తీసుకుంది. అలాగే, శార్దూల్ ఠాకూర్ను తప్పించి తుదిజట్టులోకి సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని తీసుకుంది. ఈనెల 29న ఇంగ్లండ్తో జరిగే మ్యాచ్లోరనూ టీమిండియా ఈ కాంబినేషన్నేమ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. (NCA)