Money
మద్యం బాబులు రోజు రోజు కి రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో మర్చిపోతున్నారు. మనషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఎదుటోళ్ల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నారు. తాగుబోతులు టెర్రరిస్టుల కన్నా ప్రమాదకరంగా మారుతున్నారు. ఈ మందుబాబు చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. రోడ్డుపై వెళ్లున్న జనం హడలిపోవాల్సందే తమిళనాడు లోని దిండుగల్ జిల్లాలో ఓ మందుబాబు చేసిన వీరంగానికి ఏకంగా కన్న కుతురు తో పాటు మరికొందరి నిండు ప్రాణాలు గాల్లో కలిశాయి. మైకంలో ఏం చేస్తున్నాడో తనకే తెలియని స్థితిలోఅడ్డొచ్చిన వారిని నరుకుతూ పోతూ మారణ హోం సృష్టించాడు.
మద్యానికి బానిసై పనిని పోగొట్టుకున్నాడు.. Money
44 ఏళ్ల వయసు గల ఈశ్వరన్ ఎలాంటి పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు. గతంలో ఓ ఫ్యాక్టరీలో డైలీ లేబర్ గా పని చేస్తున్న ఈశ్వరన్ మద్యానికి బానిసై పనిని కూడా పోగొట్టుకున్నాడు. ఈశ్వరన్ కు భార్య ముత్తులక్ష్మి, కుమార్తె నదియా ఉన్నారు. దీపావళి రోజున ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ పాకెట్ లో చిల్లిగవ్వ లేదు. భార్యని డబ్బు అడిగాడు. ఆమె ఇవ్వలేదు. దాంతో డబ్భుకోసం అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. చివరకు పక్కింటి వారిని, మూగ జీవాలను కూడా వదల్లేదు.. తమిళనాడు లోని దిండుగల్ జిల్లాలో నాతమ్ పట్టి సమీపంలోని కోసుకురుచ్చి గ్రామంలో ఈ ఘటన జరిగింది.
నిత్యం భార్యతో గొడవలు..
దీపావళి సందర్భంగా స్నేహితులతో కలిసి మందు పార్టీ ప్లాన్ చేసుకున్న ఈశ్వరన్ డబ్బులు కావాలని భార్య ముత్తులక్ష్మిని అడిగాడు. అప్పటి నుంచి నిత్యం భార్యతో గొడవ పడుతూనే ఉన్న ఈశ్వరన్ బుధవారం ఫుల్లుగా మద్యం తాగి వచ్చి, మత్తులో భార్యపై కత్తితో దాడికి యత్నించాడు. ఈశ్వరన్ నుంచి తప్పించుకునేందుకు ముత్తులక్ష్మి అక్కడి నుంచి పరుగు తీసింది. ఆసమయంలో భార్యపై విసిరిన కత్తి కూతురు నధియా చేతికి తగిలి తీవ్ర గాయమైంది. నదియా తీవ్ర రక్తస్రావమైన గాయాలతో బయటకు పరుగులు తీసింది. ఇంటి ముందు నిద్రపోతు ఉన్న తన తల్లి చెల్లయ్య పైకూడా ఈశ్వరన్ దాడి చేసి ఆమెను అక్కడికక్కడే నరికి చంపాడు. Money
మూగ జీవాలను కూడా వదల్లేదు..
ఆ తర్వాత వీధిలోకి వెళ్లి వీరంగం వేశాడు. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో రోడ్డుపై తిరుగుతున్న రెండు పశువులను నరికాడు . ఆపై ఆపక్కనే ఉన్న గుడిసెలోకి చొరబడ్డాడు. అక్కడ నిద్రలో ఉన్న కుట్టయ్యన్ అనే వ్యక్తిపై దాడి చేసి చంపాడు. ఇలా కనిపించిన వారిపైనా, అడ్డొచ్చిన వారిపైనా కత్తి ఝుళిపించుకుంటూ నానా భీభత్సం సృష్టించాడు. పరిస్థితిని గమనించిన స్థానికులు పెద్ద సంఖ్యలో గుమికూడి ఎట్టకేలకు తాళ్లతో ఈశ్వరయ్యను బంధించారు. స్థానికుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఈశ్వరన్ను అదుపులోకి తీసుకున్నారు. చెల్లయ్య, కుట్టయ్యన్ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నదియాను చికిత్స నిమిత్తం మధురైలోని రాజాజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యా నేరం కింద పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా స్థానిక కోర్టు రిమాండ్ విధించింది.Money