తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ఈ ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వర్షం ప్రారంభమైంది. జిల్లాల్లో కూడా చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఏపీలోనూ…
అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. ఉతరకోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. ఈ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.