ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు స్టే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ 5 జోన్ లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, అక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టారని, ఇది సీఆర్డీఏ నిబంధనలకు విరుద్ధమని అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదని…
ఇరువురి వాదనలను విన్న హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇళ్ల నిర్మాణాన్ని ఆర్ 5 జోన్ లో వెంటనే నిలిపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇది తమ విజయంగా అమరావతి రైతులు చెబుతున్నారు. రైతులకు ఊరట కలిగించాయి. పది రోజుల క్రితమే ఆర్ 5 జోన్ లో ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తున్నదీ ఆసక్తికరంగా మారింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.