ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే ప్రతి ఇంటా పండుగ వాతావరణం సంతరించుకుంటుంది . ఈ ఆనందానికి కారణం “అమ్మ”ని స్మరించడమే! అమ్మ మరెవరో కాదు జగన్మాత, ముగ్గురామ మూలపుటమ్మ, నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఈ సృష్టిలోని జ్యోతిర్మండలాలు కేవలం మానవ నిర్మితమైనవి కావు అని సాధారణంగా అంగీకరించబడింది. ఈ శక్తిని మహేశ్వరి శక్తిగా, పరాశక్తిగా, జగన్మాత శక్తిగా వివిధ రూపాల్లో పూజిస్తారు. ఈ నవరాత్రుల (Devi Navaratrulu) శుభ దినాలలో, దుర్గాసప్తశతి శ్లోకాన్ని మనం వింటూనే ఉంటాము.
శ్లోకం: !! సర్వమంగళ మాంగల్యే శివ సర్వార్థ సాధకే,
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.
ఈశ్వరుడైన ఈ శక్తీ లేనిదే ఏమి చెయ్యలేదని, శివ శక్తీ రూపమే “దుర్గ;’ అని ఆదిశంకరాచార్యులు తన అమృతవాక్కులో చెప్పారు. దేవి నవరాత్రుల (Devi Navaratrulu) సమయం లో ఈ అమ్మవారి ని రాత్రి సమయం లో పూజించిన, అర్చించిన సర్వపాపాలు నశించి కోరికలు తీరుతాయని మత్స్య పురాణం చెబుతోంది. మార్కండేయ పురాణం ప్రకారం, శుక్లపక్ష ఆశ్వీయుజమాసంలోని పాడ్యమి తిథి, హస్తా నక్షత్రానికి సంబంధించిన పవిత్రమైన రోజు, ఈ దేవి పూజను ప్రారంభించడానికి ఉత్తమమైన రోజట . అందుకే ఈ రోజున నుండే ఈ దేవి నవరాత్రులు (Devi Navaratrulu) ప్రారంభమవుతాయి. మొదటి మూడు రోజులు దుర్గా స్వరూపాన్ని ఆరాధించి అరిషడ్వార్గాలను , తర్వాతి మూడు రోజుల్లో లక్ష్మీ స్వరూపాన్ని ఆరాధించి శ్రీసంపదలను , చివరి మూడు రోజుల్లో సరస్వతీ స్వరూపాన్ని పూజించి జ్ఞానాన్ని పొందవచ్చట. .
పూర్వము భండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట. ఆ రాక్షసుడు నుండి రక్షించడం ఆది పరాశక్తి ని వేడుకోవడం ఒక్కటే మార్గం అని భావించి ఆ మహాశక్తి కోసం మహాయజ్ఞం చేశారట. ఆ యజ్ఞ గుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని అగ్ని కి ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యి వారికి అభయమిచ్చి భండాసురుడుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చిందట.
పాడ్యమి నుండి నవమి వరకు, ఆ దేవి ప్రతిరోజూ ఒక్కొక్క అవతరమెత్తి ఒక్కో రాక్షసుడిని సంహరించిందట. తమను తాము వ్యక్తపరిచిన వివిధ శక్తులు ఈ ప్రాథమిక శక్తి నుండి ఉద్భవించాయి. ఇలా ఎత్తిన అవతారలనే మనం నవ దుర్గాలు అని పిలుస్తాము.
1.మొదటి రోజు – శైలపుత్రి దేవి
2. రెండవ రోజు – బ్రహ్మచారిణి దేవి
3. మూడవ రోజు – చంద్రఘంట దేవి
4. నాలుగవ రోజు – కూష్మాండ దేవి
5. ఐదవ రోజు – స్కందమాత
6. ఆరవ రోజు – కాత్యాయనీ
7. ఏడవ రోజు – కాళరాత్రి
8. ఎనిమిదవ రోజు – మహాగౌరి
9. తోమిదవ రోజు – సిద్ధిధాత్రి
అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవ దేవీ “శ్రీకృష్ణ పరమాత్మ” చే గోకులం, బృందావనంలో పూజలందుకుందట. అంతేకాక ఆ బ్రహ్మదేవుడు మధు కైటభులు అనే రాక్షసుల బారి నుండి రక్షణ కై ఈమెను స్తుతించి విముక్తి పొందాడట . పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయము నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవతల అధిపతి సాక్షాత్తు ఆ దేవేంద్రుడు కూడా దుర్వాసుని శాపం వల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి ఆ సంపదల్ని పొందగలిగిగాడు అని పూరణలు చెబుతున్నాయి . ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోఢశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య పాముద్ర పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు (Devi Navaratrulu) అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.
ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో
శ్లో ! శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !
అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!
అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది, మ అనగా మాయ, న అంటే లేకుండా, వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.