మరికొద్ది సేపట్లో భారత్ ఓ చారిత్రక విజయాన్ని నమోదు చేయబోతోంది. చంద్రయాన్ -3 ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేందుకు జస్ట్ మరో అడుగు మాత్రమే దూరంలో ఉన్నాం.. అన్నీ కుదిరితే ఈ సాయంత్రం 6.04కి జాబిల్లిపై భారత్ తొలి అడుగు వేయబోతోంది. ల్యాండ్ రోవర్ చంద్రమండలంపై సేఫ్ గా ల్యాండ్ అయ్యే శుభ తరుణం కోసం దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఈ మిషన్ని ఆసక్తిగా చూస్తున్నారు..
చంద్రునిపై సేఫ్ గా ల్యాండ్ అయ్యే 20 నిమిషాలు అత్యంత కీలకమైన సమయం.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్ గా, స్మూత్ గా ల్యాండ్ అయితే మనం విజయం సాధించినట్లే.. కానీ క్రాష్ ల్యాండింగ్ అయితే మాత్రం వందల కోట్ల రూపాయలతో కష్టపడి చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.ప్రాజెక్ట్ చంద్రయాన్-3 కి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విశేషాలు 6.04
1. చంద్రునిపై రోవర్ ల్యాండింగ్ ముహూర్తం ఈ సాయంత్రం 6.04 నిమిషాలు.. దీనిని దేశ వ్యాప్తంగా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు.. ఈ చారిత్రక సన్నివేశాన్ని అందరూ చూసేందుకు స్కూళ్లను కూడా తెరిచే ఉంచుతున్నారు. ఈ సంఘటన సక్సెస్ కావాలని కోరుకుంటున్న ఔత్సాహికులు అప్పుడే గ్రాండ్ గా పార్టీలు చేసుకోడానికి కూడా రెడీ అవుతున్నారు. ఇక బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణ ఆఫ్రికాలో ఉన్న ప్రధాని మోడీ ఇస్రో శాస్త్రవేత్తలతో ఆన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు..
2.చంద్రునిపై కాలు మోపేందుకు రష్యా పంపిన లూనా-25 మిషన్ ఫెయిల్ కావడంతో చంద్రయాన్ ప్రాజెక్ట్ ఏం అవుతుందోనన్న సస్సెన్స్ నెలకొంది. రష్యా ఉపగ్రహం లూనా-25 చంద్రునిపై క్రాష్ ల్యాండింగ్ కావడంతో మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిపోయింది. 2019లో మనం ప్రయోగించిన చంద్రయాన్-2 మిషన్ కూడా సేఫ్ ల్యాండింగ్ విఫలమయ్యే ఫెయిల్ అయ్యింది. చంద్రుని ఉపరితలం అంతా గుంతలు, గుట్టలతో ఎగుడుదిగుడుగా ఉండటమే అందుకు కారణం..
3. చంద్రయాన్ -2 వైఫల్యంవల్ల నేర్చుకున్న పాఠాలతో ఈ సారి మిషన్ సక్సెస్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. క్రాష్ ల్యాండింగ్ కాకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు.
4. చంద్రయాన్-3 ల్యాండింగ్ ను ఇస్రో వెబ్ సైట్ , యూట్యూబ్, డీడీ నేషనల్ ఛానెళ్ల ద్వారా లైవ్ టెలికాస్ట్ ఇస్తున్నారు. సరిగ్గా 6.04 నిమిషాలకు రోవర్ ప్రగ్యాన్ ను తీసుకెళుతున్న విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ థ్రువంపై సేఫ్ ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుంది.
5. క్రాష్ ల్యాండింగ్ కాకూడదన్న ఉద్దేశంతో రోవర్ కాలు పెట్టేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేశారు. చంద్రుని పై నీటి ఆనవాళ్లున్న ప్రదేశాన్ని కనుగొనగలిగితే మన అన్వేషణ ఫలించినట్లే.. చంద్రునిపై నీటి ఆనవాళ్లున్నాయని నాసా పంపిన పరికరం 2009లో కనుగొంది. ఆ పరికరాన్ని స్పేస్ లోకి పంపినదే ప్రాజెక్ట్ చంద్రయాన్.
6. చంద్రునిపై నీళ్లున్నట్లు మనం కనుగొనగలిగితే భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు సాధ్యపడతాయి. దానిని తాగు నీరుగా మార్చుకోవడం, స్పేస్ లో యంత్ర పరికరాలను చల్లబరచుకోడానికి వినియోగించుకోవచ్చు. అలాగే ఆ నీటిని విచ్ఛేదన ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ ను కూడా తయారు చేయవచ్చు. అలాగే సముద్రాల ఆవిర్భావానికి మూల కారణాలు తెలుసుకునే వీలుంటుంది.
7.చంద్రునిపై రోవర్ ను పంపడంలో రష్యా, అమెరికా తర్వాత స్థానం మన దేశానిదే..
8.రోవర్ లో పరికరాలన్నీ సక్రమంగా ఉన్నాయని స్మూత్ ల్యాండింగ్ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని సిబ్బంది అంతా ఉత్సుకతతో చారిత్రక ఘట్టాన్ని పరిశీలిస్తున్నారని ట్విట్టర్ వేదికగా ఇస్రో ప్రకటించింది. 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి తీసిన చంద్రుని ఫొటోలను కూడా ఇస్రో రిలీజ్ చేసింది.
9. ఈ ప్రాజెక్ట్ మూన్ ల్యాండర్ ను జులై14న LVM3 హెవీ లిఫ్ట్ వెహికల్ ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టారు. ఆగస్టు5న దానిని చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత అంతరిక్ష కార్యకలాపాల పితామహుడుగా చెప్పుకునే విక్రమ్ సారాభాయి పేరుని దీనికి విక్రమ్ ల్యాండర్ అని పేరు పెట్టారు.
10. ఈ ప్రయోగం సక్సస్ అయితే మరిన్ని ప్రయోగాలను చేసేందుకు ఇస్రో అడుగులేస్తోంది. సూర్యునిపై అధ్యయనాలకు, చంద్రునిపైకి మానవ సహిత ఉపగ్రహ ప్రయోగం గగన్ యాన్ ను కూడా చేపట్టబోతున్నారు. సూర్యుని పై అధ్యయనం కోసం ఆదిత్య-L1 పేరుతో అబ్జర్వేటరీని ఇప్పటికే ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ తొలివారంలో ఆదిత్య-L1ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది.
సో జాబిల్లిపై మన విక్రమ్ రోవర్ సక్సెస్ ఫుల్ గా అడుగు పెట్టి ప్రయోగం ఫలిస్తే ఇస్రోకు ఇక తిరుగుండదు.. అంతరిక్ష రంగంలో భారత్ కీలక పాత్ర పోషించడం ఖాయం.. కాబట్టి చంద్రునిపై విక్రమ్ ల్యాండ్ రోవర్ సురక్షితంగా, స్మూత్ గా నెమ్మదిగా ల్యాండ్ అవ్వాలని అందరం కోరుకున్నాం.. 6.04