IND-CA
భారత్, కెనడాల మధ్య దౌత్య సంబంధాలు (ఆల్ టైమ్ లో) అత్యంత దయనీయ స్థితి లోకి పడిపోయాయి. కెనడా లో ఖలిస్తానీ టెర్రరిస్టు నిజ్జర్ హత్య వెనక భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో అర్ధంలేని ఆరోపణలు చేయడంతో భారత్ కెనడాతో దౌత్య సంబంధాలను తెగ తెంపులు చేసుకునే స్థితికి వచ్చేసింది. మరోవైపు మొదట్లో కెనడా, భారత్ వివాదంలో భారత్ ను సమర్ధించిన అమెరికా ఇప్పుడు మెల్లగా స్వరం మార్చడం అనుమానాలకు తావిస్తోంది. ఏదేశమైనా తప్పు చేసినట్లు తేలితే ఖండిస్తామంటూ ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది. కళ్లముందే కెనడా ప్రమేయం కనిపిస్తున్నా మాట్లాడక పోవడం, ఇంకా మధ్యవర్తి తరహా తీర్పు లివ్వడం చూస్తుంటే అమెరికా కెనడాకు మద్దతు పలుకుతున్నట్లుగా అర్ధమవుతోంది.
నిజ్జర్ హత్యపై కెనడా అవాకులు, చవాకులు IND-CA
హర్దీప్ సింగ్ నిజ్జర్ ఈ ఏడాది జూన్ లో హత్యకు గురవడం, ఆ హత్యవెనక కెనడాలోని భారత అధికార్ల హస్తం ఉందని ట్రుడో ఆరోపించడం కలకలం రేపుతోంది. భారత్ అధికార్ల హస్తముందని నమ్మడానికి తగిన ఆధారాలు తమ దగ్గరున్నాయంటున్న ట్రుడో అవేంటో మాత్ర బయటపెట్టలేదు. కెనడా చేసిన ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. వంక లేనమ్మ డొంక పట్టుకు వేళ్లాడినట్లుగా ట్రుడో తీరు ఉందని, అర్ధం లేని ఆరోపణలు చేస్తూ ఉగ్రవాదాన్ని ఏకపక్షంగా ప్రోత్సహించడం గర్హించదగ్గ అంశమనీ భారత్ మండిపడింది.
భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం చేసుకుంటోందని అక్కడ పనిచేస్తున్న భారత దౌత్యవేత్తల సంఖ్య తగ్గించిందని మనదేశం ఆరోపించింది. భారత్ లో ఉన్న కెనడా దౌత్యవేత్తలు కూడా సంఖ్యకు మించి ఉన్నారని వారిని కూడా కుదించాల్సిన అవసరం వచ్చిందని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.
వీసా సర్వీసులు రద్దు
కెనడాలో వీసా సర్వీసులను భద్రతా కారణాలతో భారత్ రద్దు చేసింది. భారత అధికారులు వీసాల మంజూరు చేయనివ్వకుండా అడ్డుపడుతున్నారని భారత్ తెలిపింది. కెనడాలో ఉన్న భారత హైకమిషన్,కాన్సులేట్ కార్యాలయాలలో అధికారులకు నిరంతరం బెదిరింపులు ఎదురవుతున్నాయి. దాంతో వారు సరిగా పనిచేయలేకపోతున్నారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన నేపధ్యంలో ఆ దేశంలో ఉన్న భారత పౌరులను జాగ్రత్తగా ఉండాలని భారత్ కోరింది.
జీ 20- సదస్సులో నిలదీసిన మోడీ
కెనడాలో భారత దౌత్య కార్యాలయాలపై ఖలిస్తాన్ మద్దతు దారులు దాడులకు తెగబడటంపై జీ 20 సదస్సులో మోడీ కెనడా ప్రధాని ట్రుడోను నిలదీశారు. అప్పట్లో ముఖం మాడ్చుకున్న ట్రుడో రెండు దేశాల మధ్య అక్టోబర్ లో జరగాల్సిన వాణిజ్య బృందం పర్యటనను వాయిదా వేశారు.
ఈ ఏడాది జూన్ లో కెనడాలోని సర్రేలోని గురుద్వార ముందు ఖలిస్తాన్ మద్దతుదారు నిజ్జర్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి భారత అధికారులే కారణమంటూ ట్రుడో ఆరోపణలు చేయడంపై మండిపడిన భారత్ ట్రుడోకు గట్టి షాక్ ఇచ్చింది.
భారత, కెనడా మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బ తిన్న ఈతరుణంలో మధ్యవర్తిత్వం చేసేందుకు మధ్యలో దూరిన అమెరికా మెల్లిగా స్వరం మార్చడం మొదలు పెట్టింది. గతంలో భారత్ ను సమర్ధించిన అమెరికా ఇప్పుడు తాము రెండు దేశాలను గమనిస్తున్నామని, తప్పు చేసిన వారెవరూ అతీతులు కారని భారత్ తప్పు చేసినా వదిలేది లేదంటూ మాట్లాడింది. తాజా పరిణామాల పట్ల అప్రమత్తమైన భారత్ అమెరికాతో కూడా ఈ విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతోంది.
మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతు IND-CA
కెనడాపై మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా సమర్ధించింది. ఉగ్రవాది నజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందనడం హస్యాస్పదమని, అందుకు తగ్గ ఒక్క ఆధారం కూడా కెనడా ఇప్పటి దాకా చూపించలేకపోయిందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. మరోవైపు గురుద్వారా ముందు జరిగిన ఆ హత్య ఉదంతంల కెనడా మానవ నిఘా ఇంటెలిజెన్స్ వర్గాల మేరకు సాక్ష్యాలు నమోదు చేసినట్లు, వాటన్నింటినీ బయటపెడతామని చెబుతోంది. కెనడాలో కొన్నాళ్లుగా సిక్కు ఉగ్రవాదం పేట్రేగిపోతోంది.
భారత్ నుంచి అక్కడకు వెళ్లిన సిక్కు ఉగ్రవాదులు అక్కడ ఖలిస్తాన్ ఉద్యమాన్ని బలపరుచుకుంటున్నారు. అక్కడనుంచి మనదేశంలో అలజడులకు, దాడులకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో రైతుల ఉద్యమం అప్పుడు కూడా ఈ అల్లరి మూకలు ఆ సంఘాల్లోకి చొరబడి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారు. కెనడా అన్నీ తెలిసి కూడా ఉగ్రమూకలను ప్రోత్సహిస్తోంది. ఇదే అంశంపై భారత్ గట్టిగా పోరాడుతోంది.