IND vs NZ
2023 వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుసగా తొమ్మిది మ్యాచ్లలో గెలిచింది. టీమిండియా ప్రపంచకప్ ప్రయాణంలో ఒకే టోర్నిలో వరుసగా తొమ్మిది మ్యాచ్లలో గెలుపొందడం ఇదే తొలిసారి. 2003 ప్రపంచకప్లో గంగూలీ నేతృత్వంలో టీమిండియా వరుసగా ఎనిమిది మ్యాచ్లలో గెలుపొందగా. ఈ రికార్డును బ్రేక్ చేసింది రోహిత్ సేన.
మళ్ళీ అదే భయం…… IND vs NZ
ఈ ప్రపంచకప్లో అజేయంగా కొనసాగిన టీమ్ ఇండియాకు వాంఖడే స్టేడియం రికార్డులు కాస్త ఇబ్బందిని కలిగిస్తున్నాయి. వాంఖడే వేదికగా ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇదే మైదానంలో రేపు జరిగే మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ జట్టును ఢీకొట్టనుంది.
టోర్నీ నిబంధనల ప్రకారం లీగ్ మ్యాచ్లు పూర్తయిన తర్వాత పాయింట్ల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న భారత జట్టు. నాలుగో ర్యాంకులో ఉన్న న్యూజిలాండ్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ రేపు జరిగే ముంబైలోని వాంఖడే స్టేడియం లో జరగనుంది. రెండో సెమీ ఫైనల్ నవంబర్ 16న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. కానీ ఈ ప్రపంచకప్ లో అజేయంగా కొనసాగుతున్న టీం ఇండియాకి వాంఖడే వేదికగా కలిసోస్తుందా లేదా అనే భయం అందరిలోను ఉంది ఎందుకంటే. ఇప్పటివరకు జరిగిన ఒక్క సెమీఫైనల్ మ్యాచ్లోనూ టీమిండియా గెలవకపోవడమే అందుకు కారణం.
సరిగ్గా నాలుగేళ్ల క్రితం…… IND vs NZ
2019 ప్రపంచకప్ సెమీస్లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. లీగ్ దశలో వరుస విజయాలతో సెమీస్ చేరిన టీమిండియా కివీస్ ముందు బోల్తాపడింది. న్యూజిలాండ్ విధించిన 240 పరుగుల టార్గెట్ను ఛేదించలేక 221 పరుగులకే కుప్పకూలింది. 18 పరుగుల తేడాతో ఓడిపోయి కోహ్లీ సేన ఇంటిదారిపట్టింది. టీమిండియా ఆ మ్యాచ్ లో ఓడిపోవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోని, రోహిత్ శర్మతో సహా టీమిండియా క్రికెటర్లందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు.
విండీస్పై రెండుసార్లు ఓటమి…..
రెండు సంవత్సరాల క్రితం నెహ్రూ కప్ సెమీ ఫైనల్ లో అదే వాంఖడేలో భారతదేశం వర్సెస్ వెస్టిండీస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లోనూ వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. అంతకు ముందు జరిగిన 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో కూడా సెమీఫైనల్లో వెస్టిండీస్ మళ్లీ భారత్ను ఓడించింది.
కివీస్పై భారత్ సెమీస్ రికార్డు…..
న్యూజిలాండ్తో సెమీఫైనల్లో భారత్ సాధించిన రికార్డును పరిశీలిస్తే… 1985లో ప్రపంచ ఛాంపియన్షిప్లో తొలిసారిగా న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇరు జట్లు తలపడ్డాయి. అయితే ఆ మ్యాచ్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయి ఇంటి దారి పట్టింది.
వాంఖడేలో భారత్ సెమీస్ ఓటమి కథ ఇలా ఉంటే. ఈ మైదానంలోనే భారత్ ప్రపంచ ఛాంపియన్గా గెలుచుకుంది. 2011 ప్రపంచకప్లో శ్రీలంకను ఓడించిన భారత్ 28 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ను గెలుచుకుంది.కానీ, జరిగిన పరిస్థితులు చుస్తే ఇప్పటి వరకు వాంఖడే స్టేడియంలో జరిగిన ఏ సెమీ ఫైనల్ మ్యాచ్ లోనూ భారత్ గెలవకపోవడం అభిమానుల్లో టెన్షన్ పెంచుతోంది.