ఆసియా కప్ 2023 టోర్నీలో మరోసారి దయాదుల పోరుకు అంతా సిద్ధమైంది ఆసియాకప్ సూపర్ 4 లో భారత్, పాకిస్థాన్ మధ్య నేడు మ్యాచ్ జరగనుంది. శ్రీలంక కొలంబోలోని ఆర్ ప్రేమదాస మైదానం వేదికగా భారత్, పాక్ తలపడనున్నాయి. నేడు శ్రీలంక లోని పల్లెకెలెలో ఫ్రెష్ పిచ్పై భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ పిచ్ పేసర్లకు, స్పిన్నర్లకు సహకరిస్తుంది. బ్యాటింగ్కు కాస్త క్లిష్టంగానే ఉంటుంది. అయితే, బంతి పాతపడ్డాక బ్యాట్పైకి వచ్చే ఛాన్స్ ఉంది.
అభిానుల్లో ఉత్కంఠ
ఆసియా కప్ లోనే నేడు బిగ్గెస్ట్ ఫైట్ జరుగుతోంది. ఆసియాకప్ 2023 టోర్నీలో భాగంగా గ్రూప్ ఏ లో ఈరెండు జట్లు తలపడటం విశేషం.. 2019 ప్రపంచకప్ తర్వాత ఈ రెండు జట్లు వన్డేలో పరస్పరం ఆడడం ఇదే తొలిసారి. గత మ్యాచ్
వర్షం కారణంగా నిలిచిపోవడంతో ఆ మ్యాచ్ విజేతలు ఎవరో తేలియకుండా పోయింది. చివరగా గతేడాది టీ20 ప్రపంచకప్లో ఇండియా, పాకిస్థాన్ తలపడ్డాయి. ఇప్పుడు ఆసియా కప్లో నేడు హోరాహోరీగా పోటీ పడేందుకు ఇండియా, పాక్ రెడీగా ఉన్నాయి. క్రికెట్ అభిమానులంతా ఈ మ్యాచ్ కోసం ఎప్పుడుఎప్పుడ్డా అని ఎదురు చూస్తున్నారు.
పేసర్లకు స్టార్ బ్యాట్స్ మన్ కు మధ్య పోరు 4
పాకిస్థాన్ పేసర్లకు, భారత స్టార్ బ్యాటర్లకు మధ్య పోరు ఈ మ్యాచ్లో ఆసక్తికరంగా ఉండే ఛాన్స్ ఉంది. పాక్ పేసర్లు షాహీన్ షా అఫ్రిదీ, నసీమ్ షా, హారిస్ రవూఫ్ను భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ ఎలా ఎదుర్కొంటారో చూడాలని అభిమానులు వేచిచూస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్లో పాక్ పేసర్లను ఓ ఆటాడుకున్న విరాట్ కోహ్లీ, ఈసారి మళ్లీ దాన్నే రిపీట్ చేయాలి అని క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూన్నారు. కొలంబోలోని ఆర్.ప్రేమదాస్ స్టేడియంలో పిచ్ నేడు స్పిన్తో పాటు పేసర్లకు కూడా అనుకూలించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కీలకంగా ఉంటారు. ఈ పిచ్ బ్యాటింగ్కు కొంత క్లిష్టంగా ఉంటుంది.
జట్టులో శ్రేయస్ అయ్యర్ 4
గాయం నుంచి కోలుకున్న భారత స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ ఆసియా కప్ తో మళ్లీ తిరిగి జట్టులోకి వచాడు. బుమ్రా, కేఎల్ రాహుల్ రాకతో భారత్ తన తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.బుమ్రా కోసం శార్దుల్ ఠాకూర్, మహమ్మద్ షమీల్లో ఒకరు బెంచ్కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.కేఎల్ రాహుల్ కోసం ఇషాన్ కిషన్ను పక్కనబెడతారా లేక శ్రేయస్ అయ్యర్ను బెంచ్పై కూర్చోబెడతారా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే తుది జట్టును ప్రకటించిన పాక్ భారత్పై విజయం సాధిస్తుంది. అని పాక్ కెప్టెన్ పళ్లు కామెంట్ చేశాడు.లీగ్ మ్యాచ్ రద్దవడం వల్ల మారిన నిబంధనలు లీగ్ దశలో ఇరు జట్లు తలపడిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. దాని దృష్టిలో ఉంచుకొని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఈ మ్యాచ్ కోసమే నిబంధనలు సవరించి రిజర్వ్ డేను కేటాయించింది. ఒకవేళ వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ కు అంతరాయం కలిగితే రేపు మ్యాచ్ పునఃప్రారంభం కానుంది.