(India-china)
డ్రాగన్ కంట్రీ మళ్లీ తన చెడ్డ బుద్ధిని ప్రదర్శించింది. భారత భూభాగాన్ని తనదిగా చూపుతూ మళ్లీ ఓ కొత్తమ్యాప్ ను విడుదల చేసి కయ్యానికి కాలు దువ్వింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతాలను తనవిగా ఆ కొత్త మ్యాప్ లో చూబెట్టింది. ఈనెల28న అంటే నిన్న విడుదల చేసిన మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ను దక్షిణ టిబెట్ గా పేర్కొంటూ అది తమదేనని ప్రకటించింది.
అలాగే 1962 నాటి యుద్ధంలో ఆక్రమించిన అక్సాయ్ చిన్ ప్రాంతం కూడా తన భూభాగాలేనంటూ బొంకడం మొదలుపెట్టింది.. ఈ కొత్త మ్యాప్ లో తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం కూడా తన భూభాగంలోనివేనని క్లెయిమ్ చేస్తోంది.
మ్యాప్ లో కనిపిస్తున్న 9 డాట్ లైన్స్ ద్వారా దక్షిణ చైనా సముద్రంలోని చాలా ప్రాంతాన్ని తమదేనని చైనా చెప్పుకుంటోంది. దక్షిణచైనా సముద్ర ప్రాంతంపై వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై కూడా కొంత భాగాన్ని తమదిగా ప్రకటించుకున్నాయి.
మ్యాపింగ్ డే పేరుతో కుట్ర ! (India-china)
సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ పబ్లిసిటీ డే సందర్భంగా ఈ మ్యాప్ ను చైనా విడుదల చేసింది. దక్షిణాఫ్రికా జోహన్సస్ బర్గ్ లో జరిగిన బ్రిక్స్ సదస్సు లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్,ప్రధాని మోడీ కలసి చర్చలు జరిపిన తర్వాత చైనా ఈ చర్యకు పాల్పడటం చైనా వక్ర బుద్ధికి నిదర్శనం.
భారత చైనా సరిహద్దుల్లోని పశ్చిమ సెక్టర్ లో వాస్తవాధీన రేఖ దగ్గర చొరబాట్లపై ప్రధాని మోడీ తన అభ్యంతరాలను జిన్ పింగ్ ద్రుష్టికి తీసు కొచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వత్రా అన్నారు. సరి హద్దుల్లో శాంతి, సామరస్యాన్నిపరిరక్షించాల్సిన అవసరాన్ని ప్రధాని మోడీ చైనాకు వివరించారని , భారత, చైనాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితి కి రావాలన్నా, స్నేహ సంబంధాలు కొనసాగిం చాలన్నా వాస్తవా ధీన రేఖను ఇద్దరూ గౌరవించాలని ప్రధాని స్పష్టం చేశారు.
అధీన రేఖ దగ్గర ఇరు దేశాలు ఉద్రిక్తతల నివారణకు తమ తమ బలగాలను ఉపసంహరించాలని, మెజారిటీ బలగాలను వెనక్కు పంపేలా ఆదేశాలు ఇవ్వాలని ఇరు నేతలూ అంగీకరించారు. సరిహద్దుల్లో ఇరు దేశాల ఉన్నతాధికారులకు ఈ ఆదేశాలు ఇవ్వాలని అంగీకరించారని వినయ్ క్వత్రా అన్నారు.
సహజ వనరులను గుప్పిట పట్టాలని…
చైనా కమ్యూనిస్టు పార్టీ సెంట్రల్ ప్రాపగాండా డిపార్టు మెంట్ కు చెందిన చైనా ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం చైనా ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, నాణ్యమైన జీవనాన్ని ప్రజలకు అందించేందుకు చైనా సహజ వనరుల నియంత్రణ కీలకమని సహజ వనరుల శాఖ చీఫ్ ప్లానర్ వు వెన్జోంగ్ అన్నట్లు తెలిపింది. దేశాభివ్రుద్ధికి సహజ వనరులను సర్వే చేయడం, మ్యాపింగ్ చేయడం,భౌగోళిక సరిహద్దులు గుర్తించుకుని వాటిని పరిరక్షించుకోవడం అత్యంత అవసరమని వెన్జోంగ్ అన్నట్లు ఆ పత్రిక రాసింది. అందులో భాగాంగానే సహజ వనరుల గుర్తింపు జరిగిందని, దీనికి సంబంధించిన భౌగోళిక డాటా, డిజిటల్ మ్యాపుల తయారీ, నావిగేషన్, చేసి డిజిటల్ ఎకానమీ పురోభివ్రుద్ధికి క్రుషి చేయడమే తమ తక్షణ కర్తవ్యమని చైనా చీఫ్ ప్లానర్ అన్నట్లు ఆ పత్రిక రాసింది. వ్యవసా యాన్ని విస్తరించి పంటలను కాపాడుకోవడం, సంబంధిత రవాణా సేవలను లొకేషన్ ఆధారిత సేవలను విస్తరించుకోవడం చేయాలని అన్నట్లు చైనా డైలీ కథనం చెబుతోంది.. డిజిటల్, రియల్ ఎకానమీలను సమీక్రుతం చేయాల్సిన అవసరాన్ని జెజియాంగ్ గుర్తించినట్లు చైనా తెలిపింది.
ఎప్పటినుంచో అరుణాచల్ ప్రదేశ్ పై కన్ను ! (India-china)
చైనాకు అనేక దేశాలతో సరిహద్దు వివాదాలున్నాయి.ఆదేశం సరిహద్దులు పంచుకునే దేశాలే కాకుండా మరిన్ని దేశాలతో డ్రాగన్ దేశానికి వివాదాలున్నాయి. ప్రాదేశిక భూభాగాలపై నియంత్రణ కోసం చైనా దేశం వేయని ఎత్తుగడ అంటూ లేదు.. మోసపూరిత విధానాలను అవలం బించడమే దాని ఎజెండా. దురాక్రమణలకు పాల్పడటంలో పెద్ద గురువైన ఆదేశం దీనికోసం అంతర్జాతీయ నిబంధనలన్నింటినీ కాలరాసింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈశాన్య ప్రాంతంలోని అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసింది. ఈ ప్రాంతం గ్రేటర్ టిబెట్ పరిధిలోకి వస్తుందని బుకాయిస్తోంది. దుష్ట బుద్ధి డ్రాగన్ కంట్రీ 11 భారత భూభాగాల పేర్లు ఏకపక్షంగా మార్చేసి తన దేశంలో కలిపేసుకుంది. ఇందులో అనేక పర్వతాలు, నదులు, నివాస ప్రాంతాలు కూడా ఉన్నాయి. చైనా ఇలాంటి దరిద్రపు పనులు చేయడం ఇదే తొలిసారి కాదు..2017,2021లో కూడా ఇలాగే భారత సరిహద్దు ప్రాంతాల పేర్లు మార్చేసి తన దేశంలో అంతర్భాగంగా చెప్పుకుంది. అప్పట్లో భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది కూడా.. అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగమని, ఇలా ఆ ప్రాంతాన్ని వేరుచేసే కుట్రలను సహించేది లేదని వార్నింగ్ ఇచ్చింది.