దాయాది దేశం పాకిస్థాన్ తో పోరు అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. బాల్.. బాల్ కు ఉత్కంఠ తప్పదు. ఇండియన్ టీం పైన కూడా పాకిస్థాన్ తో ఆడే సమయంలో ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. బౌలర్, బెటర్ ఏ మాత్రం విఫలమైన వెంటనే సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ ఎదుర్కొనక తప్పదు. అందుకే పాక్ తో మ్యాచ్ అంటేనే అదొక రకమైన టెన్షన్. అందులో మ్యాచ్ లు భారత్ లోనే జరుగుతుండటంతో మరింత ప్రెషర్ ఉంటుందని చెప్పక తప్పదు.
తొలి మ్యాచ్ అయినా…
అక్టోబర్ 15వ తేదీన అహ్మదాబాద్ వేదికగా టీం ఇండియా పాక్ తో తొలి మ్యాచ్ ఆడబోతుంది. ఆ మ్యాచ్ సెమి ఫైనల్ కాదు. అలాగే ఫైనల్ అంతకంటే కాదు. ముఖ్యంగా క్రికెట్లో గెలుపోటములు సహజం. జట్టులో ఈ ఒక్కరు క్లిక్ అయినా సరే గెలుపు పై ప్రభావం చూపుతాయి. ఒక్క బౌలర్ సక్సెస్ అయితే చాలు వికెట్స్ టప టపా పడిపోతాయి. అది ఏ జట్టు కైనా ఇబ్బందే. అయితే 50 ఓవర్లు కావడంతో మ్యాచ్ గెలుపు పై ముందుగానే స్పష్టత వస్తుండునుకుంటే పప్పులో కాలేసినట్లే.
ప్రతి బాల్
ఇది వరల్డ్ కప్. అందునా పాక్ తో మ్యాచ్. ప్రతి బాల్ ను ఇండియన్ ఫాన్స్ బేరీజు వేసుకుంటారు. ప్రతి షాట్ ను గమనిస్తూ ఉంటారు. పేరుకు వన్ డే మ్యాచ్ అయినప్పటికీ పాక్ తో ఆట కావడం తో చివరి వరకు ఉత్కంఠ గానే సాగుతుంది. ఈ మ్యాచ్ టిక్కెట్లు ఎప్పుడు విక్రయానికి పెట్టినా హాట్ కేక్ లా అమ్ముడు పోవడం గ్యారంటీ. అహ్మదాబాద్ స్టేడియం కిక్కిరిసిపోవడం అంతే నిజం. అందుకే స్టేడియం నిర్వాహకుల నుంచి పోలీసుల వరకు అన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుండటం తో ఇప్పటినుంచే టెన్షన్ మొదలయ్యింది. మరి చివరకు గెలుపు ఎవరిదైనా స్పోర్టివ్ గా తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు కోరుతున్నారు.