IND
పాలస్తీనా హమాస్ తో తీవ్రయుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ కు భారత్ తన మద్దతు ప్రకటించింది. ఈకష్ట సమయంలో భారత్ ఇజ్రాయెల్ వెంట నిలుస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. అంతకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు యుద్ధ వివరాలపైనా, పరిస్థితిపైనా మోడీకి ఫోన్ చేసి వివరించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ దానిని తీవ్రంగా ఖండిస్తుందని ఇవాళ ట్విటర్ లో మోడీ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. గతంలో పాలస్తీనా కు మద్దతు ప్రకటించిన భారత్ ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ తో సన్నిహితంగా మెదులుతోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ , ఇటలీ దేశాలు ఏక పక్షంగా ఇజ్రాయెల్ కు బేషరతుగా మద్దతు తెలపగా, మధ్య ప్రాచ్య దేశాలు మాత్రం ప్రస్తుత పరిస్థితులకు ఇజ్రాయెలే కారణమని నిందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన అభిప్రాయాన్ని చెప్పాల్సి వచ్చింది. అయితే భారత్ ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలకు స్నేహితుడేనని కాబట్టి ఈ సంక్షోభాన్ని నివారించడానికి ప్రయత్నించాలని పాలస్తీనా కోరుకుంటోంది.
ఇజ్రాయెల్ మారాలి : పాలస్తీనా
వెస్ట్ బ్యాంక్ ను పాలస్తీనా ప్రభుత్వం పాలిస్తుండగా గాజా స్ట్రిప్ నుమాత్రం హమాస్ ఏలుతున్నారు. వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయెల్ చేస్తున్న పనులకు స్పందనగానే ఈ దాడులు జరిగినట్లు పాలస్తీనా చెబుతోంది..ఈ యుద్ధానికి అంతర్జాతీయ సమాజం బాధ్యత వహించాలి. పాలస్తీనాపై ఐక్యరాజ్య సమితి800 తీర్మానాలు ఆమోదించింది. కానీ ఇజ్రాయెల్ ఒక్కటంటే ఒక్కటి కూడా అమలుచేయలేదు. పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్ తన పెత్తనాన్ని వదులుకోవాలి. అప్పుడు దాడులు కూడా ఆగిపోతాయి అన్నారు పాలస్తీనా దౌత్యవేత్త.
ఖండించిన ప్రపంచ దేశాలు IND
అమాయక పౌరుల హత్యలు, ఊచకోతను పాలస్తీనా కూడా ఖండిస్తోంది. భారత్ ఈ విషయంలో చొరవచూపి శాంతియుత పరిష్కారం వెదకాలని కోరుతోంది. మరోవైపు హమాస్ చర్యలను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు తీవ్రంగా ఖండించాయి. హమాస్ తీవ్రవాదులు దుశ్చర్యలకు ఇస్తున్నవివరణ సమర్ధనీయం కాదు. తీవ్రవాదాన్ని ఏ రూపంలోనూ సమర్ధించకూడదు. ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లో ఉన్న200 మంది కుర్రాళ్లను హమాస్ తీవ్రవాదులు ఎంత దారుణంగా హతమార్చారు?. మహిళలు, చిన్న పిల్లలను కిడ్నాప్ చేసి బందీలుగా తీసుకు వెళ్లి చిత్రహింసలకుగురి చేయడం అత్యంత హేయం అని కామెంట్ చేశాయి.
మోడీజీ జోక్యం చేసుకోండి!
మరోవైపు ఈ దారుణ మారణ హోమం ఆపే నైపుణ్యం, సమర్ధత కేవలం మోడీకి మాత్రమే ఉందని ఇజ్రాయెల్ అంటోంది. జీ 2- సదస్సులో ఆఫ్రికాను చేర్చి బ్రిక్స్ సదస్సును మరింత విస్తరించిన సమర్ధుడు మోడీ.. ఆయన తలచుకుంటే ఈ సమస్యకు తప్పక పరిష్కారం దొరుకుతుంది అని ఇజ్రాయెల్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కామెంట్ చేశారు. హమాస్ సంస్థ సంప్రదింపులకు రావడం లేదు. అదొక ఉగ్రసంస్థ. ఆడవారిని, పిల్లలను దారుణంగా చంపేయడమే దానికి తెలుసు. మోడీ ఈ అద్భుతాన్ని సాధించి యుద్ధాన్ని ఆపితే మేం ఆయన వేలు పుచ్చుకుముందుకు నడుస్తాం అని మేజర్ జనరల్ ఆమోస్ యాడ్లిన్ అన్నారు.
సాయం చేస్తున్నాం. మాకూ సాయపడండి IND
ఇజ్రాయెల్, భారత్ లకు ఒకే సారి స్వాతంత్ర్యం వచ్చిందని, రెండు దేశాలకు ఒకేరకమైన సంప్రదాయాలు, సంస్కృతి ఉన్నాయని, రెండు దేశాలకు సరిహద్దుల్లో శత్రువులు ఉన్నారని యాడ్లిన్ పోల్చారు. భారత్ కు పాకిస్థాన్, చైనా శత్రు దేశాలు కాగా, మాకు గాజా, హిజ్బుల్లా, ఇరాన్, సిరియా శత్రు దేశాలని యాడ్లిన్ కామెంట్ చేశారు. భారత్, ఇజ్రాయెల్ లలో ఒకే రాజకీయ నేపధ్యం ఉంది. భారత్ కు ఆయుధాల విషయంలో ఇజ్రాయెల్ చాలా సాయపడుతోంది. కాబట్టి మోడీ జోక్యాన్ని కోరుతున్నాం అని ఆయనన్నారు.
మధ్య ప్రాచ్యదేశాల్లో భారత్ కీలక భూమిక పోషించే సమయంలో దురదృష్టం కొద్దీ ఇజ్రాయెల్,పాలస్తీనా యుద్ధం వచ్చింది. ఈ పరిస్థితుల్లో భారత్ తన దౌత్య సంబంధాలను జాగ్రత్తగా బలోపేతం చేసుకోవాల్సి ఉంది. IND